Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు స్నేహితుడే కదా అని చేరదీస్తే అత్యాచారం చేశాడు

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (19:15 IST)
స్నేహితుడి తల్లిపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. కొడుకు స్నేహితుడిని ఆమె కొడుకుతో సమానంగా చూసింది. అయితే అతడు మాత్రం అలా అనుకోలేదు. భర్త లేని ఆమెను తనవైపు తిప్పుకోవాలని చూశాడు. ఒప్పుకోకపోవడంతో అత్యాచారానికి ఒడిగట్టాడు.
 
కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లా నవైక్కుళంలో నివాసముంటున్న 44 సంవత్సరాల మహిళ భర్తను కోల్పోయింది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ మహిళ కొడుకు రాజేష్, ప్రదీప్‌లు ఇద్దరూ స్నేహితులే. ఎప్పుడూ కలిసే ఉండేవారు. కరోనా సమయంలోను ఇద్దరూ కలిసి ఉన్నారు. 
 
ఒకరంటే ఒకరికి ప్రాణం. దీంతో రాజేష్‌తో సమానంగా ప్రదీప్‌ను భావించింది మహిళ. కానీ ప్రదీప్ మాత్రం తనలోని కామాంధుడిని బయటపెట్టాడు. రెండురోజుల క్రితం ప్రదీప్, రాజేష్ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అయితే రాజేష్‌ను మరికొంతమంది స్నేహితులతో వాళ్ల ఇంటికి పంపించేశాడు ప్రదీప్. 
 
నేరుగా రాజేష్ ఇంటికి వచ్చి అతని తల్లితో బాధపడుతూ నీ కొడుకు ఎక్కువగా తాగి పడిపోయాడంటూ వెంటనే రావాలంటూ  చెప్పాడు. ప్రదీప్ అసలు స్వరూపం తెలియని ఆమె అతనితో పాటు వెళ్ళింది. బైక్ పైన తీసుకెళ్ళిన ప్రదీప్ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆమెను వదిలి పారిపోయాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి మహిళ కొడుకు సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments