Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు స్నేహితుడే కదా అని చేరదీస్తే అత్యాచారం చేశాడు

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (19:15 IST)
స్నేహితుడి తల్లిపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. కొడుకు స్నేహితుడిని ఆమె కొడుకుతో సమానంగా చూసింది. అయితే అతడు మాత్రం అలా అనుకోలేదు. భర్త లేని ఆమెను తనవైపు తిప్పుకోవాలని చూశాడు. ఒప్పుకోకపోవడంతో అత్యాచారానికి ఒడిగట్టాడు.
 
కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లా నవైక్కుళంలో నివాసముంటున్న 44 సంవత్సరాల మహిళ భర్తను కోల్పోయింది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ మహిళ కొడుకు రాజేష్, ప్రదీప్‌లు ఇద్దరూ స్నేహితులే. ఎప్పుడూ కలిసే ఉండేవారు. కరోనా సమయంలోను ఇద్దరూ కలిసి ఉన్నారు. 
 
ఒకరంటే ఒకరికి ప్రాణం. దీంతో రాజేష్‌తో సమానంగా ప్రదీప్‌ను భావించింది మహిళ. కానీ ప్రదీప్ మాత్రం తనలోని కామాంధుడిని బయటపెట్టాడు. రెండురోజుల క్రితం ప్రదీప్, రాజేష్ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అయితే రాజేష్‌ను మరికొంతమంది స్నేహితులతో వాళ్ల ఇంటికి పంపించేశాడు ప్రదీప్. 
 
నేరుగా రాజేష్ ఇంటికి వచ్చి అతని తల్లితో బాధపడుతూ నీ కొడుకు ఎక్కువగా తాగి పడిపోయాడంటూ వెంటనే రావాలంటూ  చెప్పాడు. ప్రదీప్ అసలు స్వరూపం తెలియని ఆమె అతనితో పాటు వెళ్ళింది. బైక్ పైన తీసుకెళ్ళిన ప్రదీప్ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆమెను వదిలి పారిపోయాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి మహిళ కొడుకు సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments