Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

ఐవీఆర్
సోమవారం, 12 మే 2025 (21:01 IST)
క్రూర జంతువు పెద్దపులి దాడిలో రాజస్థాన్ రాష్ట్రంలోని రణ్‌థంబోర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ రేంజర్ దేవంద్ర్ చౌదరి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సాయంత్రం ఈ భీతావహ సంఘటన జరిగింది. రిజర్వ్ ఫారెస్ట్ జోన్ 3లోని యగ్యశాల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.
 
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... ఫారెస్ట్ రేంజర్ రొటీన్ చెకింగులో భాగంగా చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇంతలో అతడికి ఎదురుగా పెద్దపులి వచ్చేసింది. వెంటనే అతడిపై దాడి చేసి తలను కొరుకుతూ ఆ తర్వాత మెడను కొరికేసి చంపేసింది. ఆ తర్వాత మృతదేహం వద్ద 20 నిమిషాల పాటు అలాగే వుండిపోయింది. ఈ దారుణాన్ని చూసినవారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ రేంజర్ మృతదేహం దగ్గర్నుంచి అతికష్టమ్మీద పెద్దపులిని తరిమేశారు. అనంతరం అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments