Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ ఫెయిలయ్యానని మనస్తాపంతో కళాశాల భవనంపై నుంచి దూకేసిన విద్యార్థి

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (18:52 IST)
పరీక్షా ఫలితాలు వస్తే చాలు, ఫెయిల్ అయిన కొందరు విద్యార్థులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మరికొందరు తను ఫెయిలయ్యాననే బాధతో ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్నారు. ఈ రోజు ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో ఫెయిలయ్యానన్న మనస్తాపంతో ఓ విద్యార్థి కళాశాల భవనం పైనుంచి దూకేసాడు.

 
కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన ఇంటర్ విద్యార్థి పరీక్షల్లో ఫెయిలయ్యాననే బాధతో కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకేసాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 
పరీక్షల్లో ఫెయిలైనవాళ్లు జీవితంలో ఎందుకు పనికిరామని అనుకోకూడదనేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎంతోమంది ధనవంతులు పరీక్షల్లో ఫెయిల్ అయినా ఆ తర్వాత రాణించారు. కనుక పాస్ కాలేదన్న బాధతో ప్రాణాలు తీసుకోవడం సరికాదని చెపుతున్నారు మానసిక నిపుణులు.

 
ఈరోజు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 61 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. దీనితో 39 శాతం మంది ఫెయిలయ్యారు. మూల్యంకన విధానం చాలా కఠినంగా వుండటం వల్లే ఇలా జరిగిందని కొందరంటుంటే... కరోనా నేపధ్యంలో ఆల్ పాస్ చేస్తారన్న ధీమాతో చాలామంది విద్యార్థులు పుస్తకాల జోలికే వెళ్లలేదనే వాదన కూడా వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments