Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన భార్యను వశపరుచుకుని తీసుకెళ్లిన యువకుడిని కిడ్నాప్ చేసి...

ఐవీఆర్
గురువారం, 27 జూన్ 2024 (17:18 IST)
వివాహేతర సంబంధాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వీటి వెనుక కారణాలు ఏమి వున్నప్పటికీ మారుతున్న సమాజం విలువలు వీటికి అద్దం పడుతున్నాయి. తాజాగా తెలంగాణ లోని నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వివాహిత మరో యువకుడితో ప్రేమలో పడింది. దాంతో తన ముగ్గురు పిల్లల్ని సైతం వదలేసి అతడితో వెళ్లిపోయింది.
 
పూర్తి వివరాలు చూస్తే... దేవరకొండకు చెందిన సతీశ్, అనంత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. ఐతే అనంత గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ధనుష్ అనే యువకుడితో సన్నిహితంగా వుంటూ వస్తోంది. అది కాస్తా ప్రేమకి దారి తీసి ఇద్దరూ కలిసి ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. తన భార్యను ఎత్తుకెళ్లిపోయిన ధనుష్ ఆచూకి కోసం గత ఏడాదిగా వెతుకుతున్న సతీష్‌కి వారు హుజూరుబాద్‌లో వున్నట్లు తెలుసుకున్నాడు.
 
తన మిత్రుల సహాయంతో కారులో వెళ్లి ధనుష్‌ను కిడ్నాప్ చేసి కేసీ కెనాల్ వద్దకు తీసుకుని వెళ్లి దాడి చేసారు. అటుగా వెళ్తున్న స్థానికులు ఇది గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. ఐతే ఆ కారులో ధనుష్ కనిపించలేదు. ఏమయ్యాడని అడిగితే... అతడు తప్పించుకుని పారిపోయాడని చెప్పారు. కానీ... అతడు నిజంగానే తప్పించుకున్నాడా లేదంటే వీరే ఏదైనా చేసి అబద్ధం ఆడుతున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments