Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం గోధుమ పిండిలో విషం కలిపి 13 మందిని చంపేసింది

ఐవీఆర్
మంగళవారం, 8 అక్టోబరు 2024 (22:53 IST)
ప్రియుడు కోసం ప్రియురాలు దారుణానికి ఒడిగట్టింది. తన ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు పెద్దలు అడ్డుపడుతున్నారని తన సొంత కుటుంబ సభ్యులను పొట్టనబెట్టుకుంది. ఈ దారుణ ఘటన పాకిస్తాన్ దేశంలోని సింధు ప్రావిన్స్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
హైబత్ ఖాన్ బోహ్రి అనే గ్రామానికి చెందిన ఓ బాలిక గత కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం తెలిసిన పెద్దలు ఆమెను తీవ్రంగా మందలించారు. దీనితో కుటుంబం పైన పగ పెంచుకోవడమే కాకుండా తన ప్రియుడికిచ్చి పెళ్లి చేయడంలేదని వారిని మట్టుబట్టేందుకు ప్లాన్ వేసింది. ప్రియుడుతో కలిసి ఆ పనిని చేసింది.
 
గోధుమ పిండిలో విషం కలిపి చపాతీలుగా చేసి వాటిని కుటుంబ సభ్యులందరికీ వడ్డించింది. వాటిని తిన్న 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనితో వారందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అందరూ మరణించారు. ఈ దారుణానికి పాల్పడిన బాలికను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments