Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం గోధుమ పిండిలో విషం కలిపి 13 మందిని చంపేసింది

ఐవీఆర్
మంగళవారం, 8 అక్టోబరు 2024 (22:53 IST)
ప్రియుడు కోసం ప్రియురాలు దారుణానికి ఒడిగట్టింది. తన ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు పెద్దలు అడ్డుపడుతున్నారని తన సొంత కుటుంబ సభ్యులను పొట్టనబెట్టుకుంది. ఈ దారుణ ఘటన పాకిస్తాన్ దేశంలోని సింధు ప్రావిన్స్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
హైబత్ ఖాన్ బోహ్రి అనే గ్రామానికి చెందిన ఓ బాలిక గత కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం తెలిసిన పెద్దలు ఆమెను తీవ్రంగా మందలించారు. దీనితో కుటుంబం పైన పగ పెంచుకోవడమే కాకుండా తన ప్రియుడికిచ్చి పెళ్లి చేయడంలేదని వారిని మట్టుబట్టేందుకు ప్లాన్ వేసింది. ప్రియుడుతో కలిసి ఆ పనిని చేసింది.
 
గోధుమ పిండిలో విషం కలిపి చపాతీలుగా చేసి వాటిని కుటుంబ సభ్యులందరికీ వడ్డించింది. వాటిని తిన్న 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనితో వారందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అందరూ మరణించారు. ఈ దారుణానికి పాల్పడిన బాలికను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments