Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో మహిళ పరిచయం.. ఆస్పత్రికి పిలిచి మరో ఇద్దరితో కలిసి వైద్యుడు రేప్

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (10:23 IST)
సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళను ఆస్పత్రికి పిలిచిన వైద్యుడు.. మరో ఇద్దరు వైద్యులతో కలిసి ఆస్పత్రిలోనే అత్యాచారం చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీలో ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొత్వాలి ప్రాంతంలోని బస్తీ సదర్ ఆస్పత్రిలో పని చేసే ఓ వైద్యుడికి సోషల్ మీడియా ద్వారా ప్రైవేటు విద్యా సంస్థలో పని చేసే మహిళా ఉపాధ్యాయురాలితో పరిచయమైంది. అలా ఏర్పడిన పరిచయం కాస్త చనువుగా మారింది. ఈ క్రమంలో ఓ సారి తన ఆస్పత్రికి రావాలంటూ ఆమెను వైద్యుడు కోరాడు. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. 
 
అక్కడ నుంచి ఆమెను ఓ హాస్టల్ గదికి తీసుకెళ్లిన ఆ వైద్యుడు.. మరో ఇద్దరు సహచర వైద్యులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెల 27వ తేదీన ఈ ఘటన జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments