Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవా ధోనీ గోలగోల.. పాకిస్థాన్‌ను భలే ట్రోల్ చేసిన ముంబై పోలీసులు (Video)

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (12:53 IST)
ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి. మాంచెస్టర్‌లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ సందర్భంగా తుది జట్టులో స్థానం సంపాదించుకోలేక పోయిన రిషబ్ పంత్, మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె జీవాతో కలిసి గోలగోల చేశాడు. మ్యాచ్ జరుగుతున్న వేళ, వీరిద్దరూ గట్టిగా అరుస్తూ.. ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.
 
ఆ వీడియోను పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అదిప్పుడు వైరల్ అయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడటంతో, అతని స్థానంలో రిషబ్ బ్రిటన్‌కు వెళ్లి జట్టులో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చివరి జట్టులో రిషబ్‌కు దక్కకపోవడంతో జీవా ధోనీతో కలిసి గోల చేస్తూ గడిపాడు.
 
మరోవైపు.. భారత్-పాక్ మ్యాచ్‌ ప్రారంభం కావడానికి ముందు భారత జట్టుకు మద్దతుగా పాకిస్థాన్‌ను ట్రోల్ చేస్తూ ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. పాక్ జట్టు జెర్సీ రంగు అయిన గ్రీన్ ట్రాఫిక్ సిగ్నల్‌ను పోస్టు చేసిన పోలీసులు.. ''భారత్‌కు గ్రీన్ కనిపిస్తోంది. మీరెప్పుడూ చేసినట్టుగానే యాక్సిలరేటర్‌ను నొక్కిపట్టండి. హద్దుల్లేకుండా దూసుకెళ్లండి’’ అంటూ ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. పాకిస్థాన్‌ను భలే ట్రోల్ చేశారంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Partners in crime

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments