Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ వరల్డ్ కప్ ఫస్ట్ సెమీస్ : బెంబేలెత్తిపోతున్న న్యూజిలాండ్.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (10:35 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా, తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ మంగళవారం జరుగనుంది. మాంచెష్టర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందని బ్రిటన్ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో న్యూజిలాండ్ జట్టు బెంబేలెత్తిపోతోంది. 
 
మాంచెష్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డే వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వరుణు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో కివీస్ ఆందోళన చెందుతోంది. ఇప్పటివరకు రెండు సార్లు ప్రపంచకప్ విజేత అయిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈనాటి మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశం ఉంది. ఇదే కివీస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. 
 
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు కారుమబ్బులు కమ్ముకునే అవకాశం ఉంది. టాస్ వేసే (2.30 గంటలు) సమయంలో మేఘాలు కమ్ముకుని ఉంటాయి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ తెలిపింది. ఆ తర్వాత వర్షం ఆటంకం కలిగించకపోవచ్చని పేర్కొంది. అయితే మ్యాచ్ ఆసాంతం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఏంటన్నది కివీస్ ఆందోళన చెందుతోంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments