Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెమీ ఫైనల్ మ్యాచ్ : టపటపా పడిపోతున్న వికెట్లు... భారత్‌కు ఓటమి తప్పదా?

Webdunia
బుధవారం, 10 జులై 2019 (17:26 IST)
మాంచెష్టర్ వేదికగా జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతోంది. ఈ క్రమంలో జట్టు స్కోరు 71 పరుగుల వద్ద ఉండగా, రిషబ్ పంత్ వికెట్‌ను కోల్పోయింది. దీంతో 22.5 ఓవర్లలో 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 
 
అంతకుముందు 240 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్....5 పరుగులకే మూడు ప్రధానమైన వికెట్లను కోల్పోయింది. ఓపెరనర్లు, రోహిత్ శర్మ (1), కేఎల్ రాహుల్ (1), కెప్టెన్ కోహ్లీ (1) చొప్పున పరుగులు చేశారు. ఆ తర్వాత రిషబ్ పంత్‌తో జతకట్టిన హార్దిక్ పాండ్యా జట్టు ఇన్నింగ్స్ పునర్మించే బాధ్యతను తీసుకున్నారు. 
 
ఈ క్రమంలో రిషబ్ పంత్ (32) భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద హెన్రీ బౌలింగ్‌లో నీషమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి భారత్ స్కోరు 71 రన్స్. ప్రస్తుతం క్రీజ్‌లో హార్దిక్ పాండ్యా, ధోనీలు క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో హెన్రీ మూడు వికెట్లు తీయగా, బోల్ట్, సంత్నెర్‌లు తలా ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

తర్వాతి కథనం
Show comments