Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాంచెష్టర్ సెమీ ఫైనల్ : భారత టార్గెట్ 240... రోహిత్ -కోహ్లీ ఔట్

Advertiesment
World Cup 2019
, బుధవారం, 10 జులై 2019 (15:43 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తన తొలి వికెట్‌ను కోల్పోయింది. అప్పటికి భారత్ స్కోరు కేవలం నాలుగు పరుగులు మాత్రమే. ఓపెనర్ రోహిత్ శర్మ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఒక్క పరుగు చేసి ఔట్ అయ్యాడు. 
 
కాగా, మాంచెష్టర్ వేదికగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ మంగళవారం ప్రారంభమైంది. అయితే, కివీస్ ఇన్నింగ్స్ 46.1 ఓవర్ల వద్ద ఉండగా, వర్షం కారణంగా మ్యాచ్ రిజర్వు డేకు వాయిదాపడింది. దీంతో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగుల వద్ద నుంచి ఇన్నింగ్స్ ప్రారంభించింది. 
 
అయితే బుమ్రా బౌలింగ్‌లో రవీంద్ర జడేజా వేసిన త్రోకు టేలర్ (74) రనౌట్ అయ్యాడు. ఆ తర్వత భువనేశ్వర్ బౌలింగ్‌లో 12 పరుగులు చేసిన నీషమ్, హెన్రీ (1)లు ఔట్ అయ్యారు. అప్పటికి కివీస్ స్కోరు 49 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఆ తర్వాత నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. 
 
న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లో గుప్తిల్ 1, నికోల్స్ 28, విలియమ్సన్ 67, టేలర్ 74, నషీమ్ 12, గ్రాండ్‌హో 16, లాథమ్ 10, సంత్నెర్ 9, హెన్రీ 1, బోల్ట్ 3 చొప్పున పరుగులు చేశారు. ఆ తర్వాత 240 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. హెన్రీ వేసిన బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. దీంతో భారత్ తన తొలి వికెట్‌ను నాలుగు పరుగుల వద్ద కోల్పోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాంచెష్టర్ సెమీ ఫైనల్ : హమ్మయ్య మ్యాచ్ ప్రారంభం.... భారత టార్గెట్ 240