Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకులను అలరించిన ఆ మూడు ఓవర్లు.. వర్షంతో నిలిచిన మ్యాచ్

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-పాక్‌ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ధావన్‌ పాక్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. 19, 20, 21 మూడు వరుస ఓవర్లలో భారత ఆటగాళ్లు భారీ పరుగులు రాబట్టడంతో పాటు ఓపె

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (18:42 IST)
ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-పాక్‌ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ధావన్‌ పాక్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. 19, 20, 21 మూడు వరుస ఓవర్లలో భారత ఆటగాళ్లు భారీ పరుగులు రాబట్టడంతో పాటు ఓపెనర్లు ఇద్దరూ అర్ధ శతకాలు నమోదు చేశారు. 
 
అంతకుముందు 16వ ఓవర్లో టీమిండియా అత్యధికంగా 13పరుగులు సాధించింది. ఆ తర్వాత 18వ ఓవర్లో 5వ బంతిని సిక్స్‌గా మలిచి రోహిత్‌ శర్మ అర్ధశతకం పూర్తి చేశాడు. 20వ ఓవర్లో శిఖర్‌ ధావన్‌ హ్యాట్రిక్‌ ఫోర్లు బాదాడు. అదే ఓవర్‌ ఐదో బంతికి రెండు పరుగులు సాధించి 50పరుగులు పూర్తి చేశాడు. తొలి 25ఓవర్లలో 20వ ఓవర్లోనే టీమిండియా అత్యధికంగా 15పరుగులు రాబట్టింది. 
 
ఆ తర్వాత 21వ ఓవర్లో తొలి బంతికి ఆరు పరుగులు లభించాయి. 20.2ఓవర్లో ధావన్‌ ఒక్క పరుగు సాధించడంతో ఓపెనర్ల భాగస్వామ్యం 100పరుగులు దాటింది. దీంతో స్టేడియంలో అభిమానుల సందడి రెట్టింపయ్యింది. జాతీయ పతాకాలను రెపరెపలాడిస్తూ తమ తమ అభిమాన జట్లకు మద్దతు పలుకుతున్నారు.
 
చివరి 5 ఓవర్లలో పాక్ బౌలర్లు పటిష్టమైన బౌలింగుతో కేవలం 15 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్ స్కోరు మందగించింది. 33.1 ఓవర్ల వద్ద భారత్ ఒక వికెట్ నష్టానికి 173 పరుగులతో పటిష్ఠ స్థితిలో ఉన్నప్పుడు వర్షం కురవడంతో మ్యాచ్ తాత్కాలికంగా ఆగిపోయింది. వర్షం దోబూచులాడటంతో ఆట ఎప్పుడు మొదలయ్యేది సందిగ్ధంలో పడింది. 
 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments