Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ భవిష్యత్.... మన గ్రేట్ సెలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడివుంది : యూవీ

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (14:49 IST)
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యంపై ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. దీనిపై యువరాజ్ సింగ్ కూడా తనదైనశైలిలో స్పందించాడు. నాకేం తెలుసు బాస్.. మన గ్రేట్ సెలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడివుంటుంది అంటూ వ్యాఖ్యానించాడు. 
 
వాస్తవానికి ధోనీపై పలుమార్లు యువరాజ్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఇపుడు మరోమారు ధోనీ రిటైర్మెంట్‌పై కామెంట్స్ చేశాడు. ధోనీ భవితవ్యం ఎలా ఉండబోతోందంటూ ముంబైలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా... 'నాకు తెలియదు బాస్. మన గ్రేట్ సెలెక్టర్లు మీకు ఎప్పుడైనా తారసపడితే... ఆ విషయాన్ని వారినే అడగండి. ధోనీ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సింది సెలెక్టర్లే. నేను కాదు' అని చెప్పాడు.
 
మనకు మరింత మెరుగైన సెలెక్టర్ల అవసరం ఉందని యువరాజ్ తెలిపాడు. సెలెక్టర్ల పని అంత తేలికైనది కాదన్నాడు. 15 మంది ఆటగాళ్లను జట్టులోకి సెలెక్ట్ చేసినప్పుడు... అర్హత కలిగిన మరో 15 మంది ఆటగాళ్లపై చర్చ జరుగుతుందని చెప్పాడు. ఆధునిక క్రికెట్‌కు తగ్గ స్థాయిలో మన సెలెక్టర్లు లేరనేది తన అభిప్రాయమని తెలిపాడు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments