Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ భవిష్యత్.... మన గ్రేట్ సెలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడివుంది : యూవీ

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (14:49 IST)
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యంపై ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. దీనిపై యువరాజ్ సింగ్ కూడా తనదైనశైలిలో స్పందించాడు. నాకేం తెలుసు బాస్.. మన గ్రేట్ సెలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడివుంటుంది అంటూ వ్యాఖ్యానించాడు. 
 
వాస్తవానికి ధోనీపై పలుమార్లు యువరాజ్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఇపుడు మరోమారు ధోనీ రిటైర్మెంట్‌పై కామెంట్స్ చేశాడు. ధోనీ భవితవ్యం ఎలా ఉండబోతోందంటూ ముంబైలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా... 'నాకు తెలియదు బాస్. మన గ్రేట్ సెలెక్టర్లు మీకు ఎప్పుడైనా తారసపడితే... ఆ విషయాన్ని వారినే అడగండి. ధోనీ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సింది సెలెక్టర్లే. నేను కాదు' అని చెప్పాడు.
 
మనకు మరింత మెరుగైన సెలెక్టర్ల అవసరం ఉందని యువరాజ్ తెలిపాడు. సెలెక్టర్ల పని అంత తేలికైనది కాదన్నాడు. 15 మంది ఆటగాళ్లను జట్టులోకి సెలెక్ట్ చేసినప్పుడు... అర్హత కలిగిన మరో 15 మంది ఆటగాళ్లపై చర్చ జరుగుతుందని చెప్పాడు. ఆధునిక క్రికెట్‌కు తగ్గ స్థాయిలో మన సెలెక్టర్లు లేరనేది తన అభిప్రాయమని తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments