కోహ్లీ కెప్టెన్సీపై గంగూలీ ఏమన్నాడు..? ఐసీసీ టోర్నీలపై దృష్టి పెట్టాలట..

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (18:28 IST)
బీసీసీఐ అధ్యక్షుడిగా దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియామయం ఖాయమైంది. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి కెప్టెన్సీలో మన జట్టు మంచి ప్రదర్శనలు చేస్తోందని కొనియాడాడు. అయితే, కీలకమైన ఐసీసీ టోర్నీలో మాత్రం ఓటమి చవిచూశారని.. దీనిని అధిగమించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వుంటుందని చెప్పాడు. 
 
ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌తో సరిపెట్టుకోవడంపై కూడా గంగూలీ కామెంట్లు చేశాడు. ఆటగాళ్లంతా అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ సెమీఫైనల్‌, ఫైనల్స్‌లో రాణించలేకపోతున్నారు. ఇకపై ఆ సీన్ మారాలి. విరాట్ సారథ్యంలో మన జట్టు మెరుగైన విజయాలతో రాణించాలని సూచించాడు.
 
2013లో ధోని సారధ్యంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫి గెలిచిన టీమిండియా ఆ తర్వాత ఐసీసీ టోర్నీలో విజేతగా నిలవలేదు. కానీ కోహ్లీ సారధ్యంలో టీమిండియా ఇంటాబయటా మెరుగైన ఆటతో దూసుకెళ్తోంది. అయినా ఐసీసీ టోర్నీలపై దృష్టి పెట్టాల్సిన అవసరం వుందని గంగూలీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు

నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

తర్వాతి కథనం
Show comments