Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ కెప్టెన్సీపై గంగూలీ ఏమన్నాడు..? ఐసీసీ టోర్నీలపై దృష్టి పెట్టాలట..

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (18:28 IST)
బీసీసీఐ అధ్యక్షుడిగా దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియామయం ఖాయమైంది. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి కెప్టెన్సీలో మన జట్టు మంచి ప్రదర్శనలు చేస్తోందని కొనియాడాడు. అయితే, కీలకమైన ఐసీసీ టోర్నీలో మాత్రం ఓటమి చవిచూశారని.. దీనిని అధిగమించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వుంటుందని చెప్పాడు. 
 
ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌తో సరిపెట్టుకోవడంపై కూడా గంగూలీ కామెంట్లు చేశాడు. ఆటగాళ్లంతా అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ సెమీఫైనల్‌, ఫైనల్స్‌లో రాణించలేకపోతున్నారు. ఇకపై ఆ సీన్ మారాలి. విరాట్ సారథ్యంలో మన జట్టు మెరుగైన విజయాలతో రాణించాలని సూచించాడు.
 
2013లో ధోని సారధ్యంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫి గెలిచిన టీమిండియా ఆ తర్వాత ఐసీసీ టోర్నీలో విజేతగా నిలవలేదు. కానీ కోహ్లీ సారధ్యంలో టీమిండియా ఇంటాబయటా మెరుగైన ఆటతో దూసుకెళ్తోంది. అయినా ఐసీసీ టోర్నీలపై దృష్టి పెట్టాల్సిన అవసరం వుందని గంగూలీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments