Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ టీ-20.. థాయ్‌ను చిత్తు చేసిన టీమిండియా

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (22:23 IST)
మహిళల ఆసియా కప్ టీ-20 క్రికెట్‌ టోర్నీలో భారత మహిళా జట్టు మెరిసింది. మరోసారి లీగ్ మ్యాచ్‌లో సత్తా చాటింది. సెమీఫైనల్లోకి ఇప్పటికే అడుగుపెట్టిన భారత మహిళా జట్టు థాయ్‌లాండ్‌కు చుక్కలు చూపించారు. 
 
తొలుత బౌలింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో సత్తా చాటింది. థాయిలాండ్ సెట్ చేసిన 38 పరుగుల టార్గెట్‌ను కేవలం ఆరు ఓవర్లలో ఫినిష్ చేసింది. 38 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 6 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. 
 
భారత స్పిన్నర్ల దెబ్బకి 37 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన థాయిలాండ్ 15.1 ఓవర్లలో 37 పరుగులు మాత్రమే చేసింది. ఈ ఆసియా కప్ లో పాకిస్తాన్‌ను ఓడించిన థాయిలాండ్ జట్టు ఈ మ్యాచులో మాత్రం టీమిండియా ముందు తేలిపోయింది.  
 
ఈ విజయంతో ఆసియా కప్ లీగ్ స్టేజీలో 10 పాయింట్లతో టాప్ ప్లేసులో నిలిచింది టీమిండియా. రేపు జరిగే మ్యాచుల ద్వారా టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరో తేలనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున చంద్రబాబు ఇల్లు కూల్చేయాల్సిందే.. విజయ సాయిరెడ్డి

తెలంగాణలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం - శ్రీధర్ బాబు

దశాబ్దం తర్వాత జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

మైనర్ చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్!

జడ్జి వేధింపులు తట్టుకోలేక రైలు కింద పడబోయిన ఎస్ఐ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైనర్ బాలికను అసిస్టెంట్ గా చేసుకున్న జానీ మాస్టర్ - నిర్మాణ సంస్థలోనూ కమిట్ మెంట్ చేయాలి?

వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలని వుంది : జూనియర్ ఎన్టీఆర్

నా ఫేవరేట్ డైరెక్టర్ ఒప్పుకుంటే డైరెక్ట్ తమిళ సినిమా చేస్తా : ఎన్.టి.ఆర్.

అరెస్టు వెనుక ఆర్థిక, రాజకీయ, అంగబలం : ముంబై నటి జెత్వానీ

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

తర్వాతి కథనం
Show comments