Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషబ్ పంత్ అదరగొట్టేశాడు.. కష్టాలు ఎవరికి?

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (10:49 IST)
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ అద్భుతంగా ఆడటంతో.. అతడు తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సాహాకు కష్టాలు తప్పవని సమాచారం. న్యూజిలాండ్ లెవన్ జట్టుతో ఈ నెల 14వ తేదీన ఆరంభమైన మూడు రోజుల క్రికెట్ టెస్టు మ్యాచ్, తొలి ఇన్నింగ్స్‌లో ఆడిన భారత జట్టు 263 పరుగులు సాధించింది. 
 
వికారి 101 పరుగులు, పుజారా 93 పరుగులు సాధించారు. తదనంతరం బరిలోకి దిగిన కివీస్ లెవన్ జట్టు 135 పరుగులకు ఆలౌటైంది. అటుపిమ్మట రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 252 పరుగులు సాధించింది. ఇందులో రిషబ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 70 పరుగులు సాధించాడు. ఇందులో 4 సిక్సర్లు వున్నాయి. 
 
టీమిండియా ఇటీవల ఆడిన మ్యాచ్‌ల్లో రిషబ్ పంత్ మెరుగ్గా రాణించలేకపోయాడు. అయితే ప్రస్తుత మ్యాచ్‌లో నిలకడగా ఆడిన కారణంగా ఈ నెల 21వ తేదీ నుంచి కివీస్‌తో ప్రారంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం వికెట్ కీపర్‌గా వున్న సాహెల్‌కు కష్టాలు తప్పవని.. అతనిని తొలగించి అతని స్థానంలో రిషబ్ పంత్‌ను తీసుకునే ఛాన్సుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విషాదం.. పెళ్లి కాలేదని రైలుకిందపడి వైద్యుడి ఆత్మహత్య

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

తర్వాతి కథనం
Show comments