Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ స్టెప్పులు వారెవ్వా.. క్రిస్ గేల్‌కూ నేర్పించాడు (Video)

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (18:55 IST)
వెస్టిండీస్‌‍తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. తొలి వన్డే సందర్భంగా ఓ వైపు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుంటే, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మైదానంలోనే డీజే పాటలకు స్టెప్పులు వేసి కెమెరాలకు చిక్కాడు.


ఇంకా కోహ్లీ స్టెప్పులు అభిమానులను అలరించాయి. అనంతరం ఈ డ్యాన్స్ గురించి కోహ్లీ మాట్లాడుతూ.. మ్యూజిక్ విన్నప్పుడు తనకు డ్యాన్స్ చేయాలనిపిస్తుందని చెప్పాడు. 
 
విరామం అనంతరం మైదానంలోకి వచ్చిన కోహ్లీ డీజే పాటలకు స్టెప్పులు వేసాడు. డీజేకు అనుగుణంగా సహచర ఆటగాళ్లతో డాన్స్ చేసాడు. క్రిస్ గేల్ కూడా తనదైన శైలిలో కోహ్లీతో కలిసి డాన్స్ చేసాడు. అనంతరం మైదాన సిబ్బందితో సైతం సరదాగా గడిపాడు. కోహ్లీ స్టెప్పులు వేయడంతో మైదానంలోని అభిమానులు పండగ చేసుకున్నారు. 
 
ఇక తాజాగా, ఆదివారం ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా విండిస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (125 బంతుల్లో 120; 14 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments