వచ్చే నెల మూడో తేదీ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్ కోసం కరేబియన్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. ఇందులో గత యేడాది నవంబర్ నుంచి జట్టుకు దూరంగా ఉన్న సునీల్ నరేన్, ఆల్రౌండర్ కియోరన్ పొల్లార్డ్లకు చోటు కల్పించింది.
గత యేడాది శ్రీలంక పర్యటన తర్వాత వెస్టిండీస్ ఆడుతున్న అంతర్జాతీయ సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఈ టోర్నీలో భాగంగా జూన్ మూడో తేదీన జరిగే మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు సౌతాఫ్రికాతో తలపడుతుంది. ఆ తర్వాత జూన్ 5న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్లన్నీ గయానా వేదికగా జరుగుతాయి. టోర్నీలో రెండో రౌండ్ మ్యాచ్లు సెయింట్ కిట్స్ వేదికగా నిర్వహిస్తారు.