Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింబాబ్వేలో అత్యాచారం కేసులో అరెస్టై రిలీజైన క్రికెటర్ ఎవరు? డీఎన్ఏ టెస్టుకు సిద్ధమట!

Webdunia
సోమవారం, 20 జూన్ 2016 (11:42 IST)
జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుపై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరోపణలు వచ్చాయి. ఆ దేశానికి చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడినట్టు స్థానిక మీడియాలో వార్తలు రావడం సంచలనంగా మారాయి. దీంతో ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. భారత క్రికెటర్లు ఎవరూ అత్యాచారం కేసులో అరెస్టు కాలేదంటూ వివరణ ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది.
 
అయితే, అత్యాచారం ఆరోపణల్లో ఈ సిరీస్‌ను స్పాన్సర్ చేస్తున్న సంస్థకు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్టు తెలుస్తోంది. అదేసయమంలో ఓ భారత క్రికెటర్ పాత్ర కూడా ఉన్నట్టు వినికిడి. దీంతో ఆగ్రహించిన ఆ క్రికెటర్ తాను అలాంటివాడిని కాదనీ, అవసరమైతే డీఎన్ఏ టెస్టుకు సిద్ధమంటూ ప్రకటించినట్టు సమాచారం. అత్యాచారం కేసులో సంబంధం లేకుండా ఆ క్రికెటర్ ఇలా ఎందుకు ప్రకటించారన్నదానిపై ఇపుడు చర్చ జరుగుతోంది. పైగా, ఆ క్రికెటర్ ఎవరన్నదానిపై మీడియా ఆరా తీస్తున్నట్టు సమాచారం. 
 
కాగా, ఈ అంశంపై బీసీసీఐ వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. నిజానిజాలు పూర్తిగా తెలియకముందే వ్యాఖ్యానించడం తగదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే టోర్నీని భారత్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments