Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్ యార్కర్.. చెదిరిపోయిన స్టంప్.. కారణం ఎవరు? (Video)

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (17:52 IST)
శ్రీలంకతో జరిగిన చివరి ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత జట్టు గెలుపును నమోదు చేసుకుని ట్రోఫీని గెలుచుకుంది. భారత్-శ్రీలంక మధ్య పూణేలో శుక్రవారం ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ (54), శిఖర్ ధావన్ (52) అర్థసెంచరీలతో శుభారంభాన్నిచ్చారు. తదనంతరం మనీష్ పాండే (31), విరాట్ కోహ్లీ (26)లు మోస్తరుగా రాణించారు. ఇంకా ఫాస్ట్ బౌలర్ సర్దుల్ ఠాగూర్ 8 బంతుల్లో 2 సిక్సర్లు, ఒక బౌండరీతో కలిసి 22 పరుగులు సాధించాడు. ఫలితంగా 20 ఓవర్లలో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. 
 
ఆపై 202 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన శ్రీలంక ఆరంభం నుంచే తడబడింది. టీమిండియా బౌలర్ల ధాటికి లంకేయులు బ్యాటింగ్‌లో రాణించలేకపోయారు. శ్రీలంక జట్టులో మాథ్యూస్ మాత్రమే అత్యధికంగా 31 పరుగులు సాధించాడు. ధనంజయ సిల్వ 57 అర్థసెంచరీ సాధించాడు.

మిగిలిన బ్యాట్స్‌మెన్లు స్వల్ప పరుగులకే అవుటై పెవిలియన్ చేరారు. ఈ నేపథ్యంలో 15.5 ఓవర్లలో శ్రీలంక జట్టు 123 పరుగులు మాత్రమే సాధించి ఆలౌటైంది. దీంతో 78 పరుగుల తేడాతో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుని టీ-20 సిరీస్‌ను 2-0 తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో నాలుగో ఓవర్‌కు బంతి విసిరిన యువ బౌలర్ నవదీప్ సైనీ.. యాకర్ బౌలింగ్‌తో శ్రీలంక వికెట్ కీపర్ పెరెరా వికెట్‌ను తీసుకున్నాడు. సైనీ విసిరిన బంతికి స్టంప్ చెదిరిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యార్కర్‌తో అదరగొట్టి అద్భుతమైన వికెట్ చేజిక్కించుకున్న సైనీకి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments