Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబటి రాయుడుకి బెదిరింపు.. ఆర్సీబీ ఫ్యాన్స్ చేసినవేనా?

ఠాగూర్
గురువారం, 30 మే 2024 (15:49 IST)
ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఛాంపియన్‌గా కోల్‌కతా నిలిచింది. ఫైనల్‌లో హైదరాబాద్‌ను చిత్తు చేసిన కేకేఆర్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఆగ్రహాన్ని తెప్పించాయి. "ఆరెంజ్‌ క్యాప్‌లు టైటిల్‌ను అందించలేవు. ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టినంత మాత్రాన కప్‌ సాధించినట్లు కాదు" అని కామెంట్రీ సందర్భంగా రాయుడు వ్యాఖ్యానించాడు.

దీంతో విరాట్ కోహ్లీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని.. తమ అభిమాన క్రికెటర్‌పై విమర్శలు చేయడంతో సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేశారు. తాజాగా అంబటి కుటుంబ సభ్యులను ఉద్దేశించి బెదిరింపులు వచ్చినట్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. స్నేహితుడి కుటుంబంతో కలిసి అంబటి రాయుడి ఫ్యామిలీ డిన్నర్‌కు వెళ్లింది. ఆ సమయంలోనే తమకు హత్యాచారం బెదిరింపులు వచ్చినట్లు రాయుడు భార్య విద్య తెలిపినట్లు ఫ్యామిలీ ఫ్రెండ్ వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  
 
'ఇటీవల ఐపీఎల్‌ ముగిసిన తర్వాత కామెంటేటర్‌గా ఉన్న అంబటి రాయుడు ఓ జట్టు ప్రదర్శనపై వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి కొందరు పనిగట్టుకొని విమర్శలు చేయడం ప్రారంభించారు. మొదట్లో మేం సరదాగానే తీసుకున్నాం. అయితే, అసభ్యకర రీతిలో పోస్టులూ చేశారు. అదే సమయంలో రాయుడు భార్య తమపై వ్యక్తిగతంగా మాటల దాడి చేస్తున్నారని తెలిపారు. బాధ్యతగా ఉన్న ఓ వ్యక్తి కుటుంబంపై ఇలా రెచ్చిపోవడానికి అవకాశం ఇవ్వకూడదు. మాట్లాడే స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగినట్లే. తప్పకుండా వారి కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. పోలీసులు సత్వరం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన, మద్దతు ఇచ్చినవారు ఎంతటి స్టార్లు అయినా వదిలిపెట్టొద్దు' అని పోస్టులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments