Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవాన్ల పిల్లల్ని నేను చదివిస్తానంటున్న మాజీ క్రికెటర్.. ఎవరు?

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (10:39 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు అండగా ఉండేందుకు భరతజాతి మొత్తం మద్దతుగా నిలుస్తోంది. ముఖ్యంగా, అదేసమయంలో జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు అనేక మంది సెలెబ్రిటీలు మందుకు వస్తున్నారు. ఇలాంటి వారిలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. ఢిల్లీకి చెందిన ఈ మాజీ క్రికెటర్ తనది పెద్ద మనసు అంటూ మరోమారు నిరూపించాడు. 
 
దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల పిల్లల పట్ల భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన సహృదయతను చాటుకున్నాడు. కన్నవాళ్లను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న సైనికుల కుటుంబాలకు బాసటగా నిలిచాడు. వీరసైనికుల పిల్లల చదవుకయ్యే పూర్తి ఖర్చును తాను భరిస్తానంటూ సెహ్వాగ్ శనివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. 
 
'దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలకు అండగా నిలుద్దాం. ఉగ్రదాడిలో మరిణించిన సీఆర్పీఎఫ్ వీర జవాన్ల పిల్లల చదువు బాధ్యతను నేను తీసుకుంటున్నాను. వారంతా నా ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకోవచ్చు' అని వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించాడు. సెహ్వాగ్ ధాతృత్వంపై నెటిజన్లు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments