Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ ఫోటోను గీసిన సెహ్వాగ్ తనయుడు.. జై నటరాజ్ అంటూ సెహ్వాగ్ ట్వీట్

టీమిండియా మూడు ఫార్మాట్‌లకు స్వస్తి పలికి బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఫోటోను... మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చిత్రీకరించాడు. తన తండ్రి విధ్వంసక క్రికెటర్‌ అయినప్పటికీ వీర్

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (16:56 IST)
టీమిండియా మూడు ఫార్మాట్‌లకు స్వస్తి పలికి బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఫోటోను... మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చిత్రీకరించాడు. తన తండ్రి విధ్వంసక క్రికెటర్‌ అయినప్పటికీ వీర్‌కి ధోని అంటే ఎక్కువ ఇష్టమట. అయితే తన అభిమానాన్ని వినూత్నంగా వెల్లడించాడు. ధోని బ్యాటింగ్‌ చేస్తున్న ఫొటో మాదిరి చిత్రాన్ని పెన్సిల్‌తో తెల్ల కాగితంపై చిత్రించాడు. ఆర్యవీర్‌ గీసిన ఈ చిత్రాన్ని సెహ్వాగ్‌ తన ఫేస్‌బుక్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
కాగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత క్రికెట్‌కు మంచి గుర్తింపు సంపాదించిపెట్టిన ధోనీ.. తన తొమ్మిదేళ్ల కెరీర్‌లో టీ20, వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీలను భారత్‌కు సాధించి పెట్టిన గొప్పసారిథిగా పేరు కొట్టేశాడు. అలాంటి స్టార్‌ క్రికెటర్‌కు చిన్నా పెద్దా తేడా లేకుండా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. వీరిలో టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనయుడు ఆర్యవీర్‌ కూడా ఒకడని సెహ్వాగ్ ట్విట్టర్లో తెలిపాడు. ఇంకా ధోనీ బ్యాటింగ్ నటరాజ స్వామిలా ఉందని కూడా సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments