కోహ్లీ అత్యుత్సాహం.. వాకీ టాకీ వాడి చిక్కుల్లో పడ్డాడు.. ఐసీసీ క్లీన్ చిట్

వాకీ టాకీ వాడిన వ్యవహారంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోహ్లీకి క్లీన్ చిట్ ఇచ్చింది. మొబైల్ ఫోన్లు డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకురాకూడదనే నిబంధన వుండటంతోనే కోహ్లీ వాకీ టాకీని ఉపయోగించాడని తేలింది

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (15:28 IST)
ఢిల్లీ వేదికగా బుధవారం రాత్రి జరిగిన తొలి ట్వంటీ20లో పర్యాటక జట్టు న్యూజిలాండ్‌ను విరాట్ కోహ్లీ సేన చితక్కొట్టింది. ముఖ్యంగా, టీ-20ల్లో న్యూజిలాండ్‌పై ఖాతా తెరవాలన్న కసితో ఆడింది. అలాగే సుదీర్ఘ కెరీర్‌కు సొంతగడ్డపై వీడ్కోలు పలుకుతున్న ఆశీష్‌ నెహ్రాను విజయంతో సాగనంపాలన్న పట్టుదలతో కివీస్‌ను టీమిండియా మట్టికరిపించింది.
 
అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా అనవసరపు వివాదంలో చిక్కుకొన్నాడు. న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ ఆడుతూ వాకీటాకీ వాడినట్లుగా కోహ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.  
 
ఐసీసీ నియావళి ప్రకారం ఓ క్రికెటర్ మ్యాచ్ ఆడుతూ వాకీటాకీ వాడటం నిషేధం. ఈ ఆరోపణలపై బీసీసీఐ సైలెంట్‌గా వున్నప్పటికీ వాకీ టాకీని ఉపయోగించిన కోహ్లీ కెమెరాలకు చిక్కడంతో అసలు సంగతి బయటికి వచ్చింది. ఢిల్లీ పేసర్ అశీష్ నెహ్రా వీడ్కోలు మ్యాచ్‌గా జరిగిన ఈ పోటీలో కొహ్లీ అత్యుత్సాహం ప్రదర్శించినట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 
 
అయితే వాకీ టాకీ వాడిన వ్యవహారంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోహ్లీకి క్లీన్ చిట్ ఇచ్చింది. మొబైల్ ఫోన్లు డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకురాకూడదనే నిబంధన వుండటంతోనే కోహ్లీ వాకీ టాకీని ఉపయోగించాడని తేలింది. సపోర్ట్ స్టాఫ్ డ్రెసింగ్ రూమ్ సభ్యులను కమ్యూనికేట్ చేసేందుకు వాకీ టాకీలను ఉపయోగిస్తుంటారు. 
 
మొబైల్ ఫోన్లు అనుమతి లేకపోవడంతో మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్ సభ్యులకు సమాచారాన్ని చేరవేసేందుకే కోహ్లీ వాకీ టాకీ ఉపయోగించాల్సి వచ్చిందని.. దీనిని ఉపయోగించేందుకు ముందే వెన్యూ ఏసీయూ మేనేజర్ అనుమతిని కూడా కోహ్లీ తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఐసీసీ కోహ్లీకి క్లీన్ చిట్ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments