Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టుకు ఇద్దరి సేవలు అక్కర్లేదు : గంగూలీ

Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (12:48 IST)
భారత మాజీ క్రికెటర్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు మరింత పటిష్టంగా ఉండాలంటే ఇద్దరు క్రికెటర్లను జట్టు నుంచి తొలగించాలని కోరారు. ముఖ్యంగా, మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చహల్‌లను తిరిగి ఎంపిక చేయాలని సూచన చేశారు. 
 
ఇదే అంశంపై సౌరవ్ స్పందిస్తూ, ప్రస్తుతం యువ క్రికెటర్లను పరీక్షించాలనే ఉద్దేశంతో చహల్‌ను పక్కకు పెట్టినప్పటికీ, టీ20 ఫార్మాట్‌లో అతని అవసరం చాలా ఉందన్నాడు. వచ్చే ఏడాది వరల్డ్‌ టీ20 జరుగనున్న నేపథ్యంలో కుల్దీప్‌ యాదవ్‌, చహల్‌లు ఎంతో ముఖ్యమన్నాడు. వీరిద్దరూ జట్టులో ఉంటే భారత జట్టు మరింత బలోపేతం అవుతుందని చెప్పాడు. 
 
కాగా, వరల్డ్‌ టీ20 ఫలితం ఎలా ఉండబోతుందనే దానిపై మాత్రం గంగూలీ సమాధానం చెప్పలేదు. కాకపోతే ఆ మెగా టోర్నీలో విరాట్‌ కోహ్లి కీలక పాత్ర పోషిస్తాడని ఆశిస్తున్నానన్నాడు. ఆ వరల్డ్‌కప్‌ కోహ్లీ చాలా ముఖ్యమైనదన్నాడు. 
 
అదేసమయంలో భారత జట్టు ఇద్దరు లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు అయిన రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్యాలు అవసరం లేదన్నాడు. వీరిలో ఎవరో ఒకరు ఉంటే సరిపోతుందన్నాడు. ఆ ఇద్దర్నీ ఒకే మ్యాచ్‌ తుది జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని గుర్తించాలని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

తర్వాతి కథనం
Show comments