Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ గదను మూడోసారి నిలబెట్టుకున్న కోహ్లీ సేన (video)

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (09:28 IST)
టెస్ట్ క్రికెట్‌లో తమకు తిరుగులేదని భారత క్రికెట్ జట్టు మరోమారు నిరూపించింది. ఫలితంగా వరుసగా మూడో యేడాది కూడా ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకుంది. కోహ్లీ సేన 116 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌ (108) రెండో స్థానం సాధించింది. ఆస్ట్రేలియా (104) నాలుగో స్థానానికి పరిమితమైంది. ప్రథమ స్థానంలో ఉన్న భారత్‌కు దాదాపు రూ.7 కోట్ల ప్రైజ్‌మనీతో పాటు.. ఐసీసీ ఇచ్చే గదను కూడా దక్కించుకుంది. 
 
దీనిపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ, సుదీర్ఘ ఫార్మాట్‌లో టాప్‌లో నిలువడం చాలా చాలా గర్వంగా ఉంది. వరుసగా మూడో ఏడాది నంబర్‌ వన్ స్థానంలో నిలవడం మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నాడు. భారత్‌ జట్టు ఇప్పుడు బలంగా ఉందన్న కోహ్లీ... కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష వల్లే విజయాలు సాధ్యమయ్యాయన్నాడు. వచ్చే యేడాది కూడా టెస్టు ఛాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకోవాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. 
 
గత యేడాది కాలంలో కోహ్లీసేన.. అఫ్ఘానిస్థాన్‌తో ఏకైక టెస్టును, వెస్టిండీస్‌పై 2-0తో సిరీస్‌ను గెలుచుకుంది. అలాగే ఇంగ్లండ్‌పై 1-4తో సిరీస్‌ ఓడినా.. ఆసీస్‌ పర్యటనలో 2-1తో టెస్టు సిరీస్‌ను చరిత్రాత్మక విజయంతో దక్కించుకుంది.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

తర్వాతి కథనం
Show comments