Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క శర్మ వల్లే రాణించగలిగాను... ఎక్కువ క్రెడిట్ ఆమెకే: విరాట్ కోహ్లీ

దక్షిణాఫ్రికా గడ్డపై తాను రాణించేందుకు తన భార్య అనుష్క శర్మనే కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ మొత్తం మూడు సెంచరీలు, ఒక అర్థ సెంచరీతో అదరగొట్టాడు. మొ

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (10:04 IST)
దక్షిణాఫ్రికా గడ్డపై తాను రాణించేందుకు తన భార్య అనుష్క శర్మనే కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ మొత్తం మూడు సెంచరీలు, ఒక అర్థ సెంచరీతో అదరగొట్టాడు. మొత్తం 558 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను అందుకున్న కోహ్లీ.. శనివారం ముగిసిన మ్యాచ్‌కు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన సతీమణి వల్లే ఈ స్థాయికి రాణించగలిగానని అనుష్క శర్మను ఆకాశానికెత్తేశాడు. 
 
ఈ విజయంలో ఎక్కువ క్రెడిట్ అనుష్కకే చెల్లుతుందని చెప్పారు. వ్యక్తిగత ప్రదర్శనతో కెప్టెన్‌గా విజయాలు అందుకోవడం గొప్ప అనుభూతి అని.. జట్టు విజయాల కోసం తన వంతుగా 120 శాతం కృషి చేస్తానని కోహ్లీ చెప్పారు. ఇప్పటికే సిరీస్ అయిపోలేదని ట్వంటీ-20 సిరీస్‌ను కూడా వదులుకునే ప్రసక్తే లేదని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
 
ఇకపోతే.. దక్షిణాఫ్రికాతో మూడు ట్వంటీ-20ల సిరీస్ ఆదివారం జోహెన్స్‌బర్గ్ వేదికగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక శనివారం నాటి ఆరో వన్డేలో 129 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ, ఈ సిరీస్‌లో మూడో సెంచరీ చేసి జట్టుకు భారీ విజయం  అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను సైతం కోహ్లీ సొంతం చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

వరుసబెట్టి మావో అగ్రనేతలను లేపేస్తున్న 'ఆపరేషన్ కగారు'

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments