Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరుష్క ఇంట్లో పనిమనుషులు వుండరట.. అన్నీ తానై కోహ్లీ చేస్తాడట..!

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (13:21 IST)
ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు మాజీ సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అతనిదని, చాలా నిరాడంబరంగా ఉంటాడని అతడు చెప్పాడు. కోహ్లి, అతని భార్య అనుష్క శర్మల సంపద రూ.1200 కోట్ల వరకూ ఉంటుంది. 
 
ఈ ఇద్దరూ ముంబైలో రూ.34 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. అయినా వాళ్ల ఇంట్లో పని మనిషి లేదని, ఇంటికి గెస్ట్‌లు ఎవరు వచ్చినా కోహ్లి, అనుష్కనే స్వయంగా వాళ్లకు అన్ని పనులు చేసి పెడతారని శరణ్‌దీప్ సింగ్ చెప్పాడు.
 
ఫీల్డ్‌లో కోహ్లి చాలా దూకుడుగా ఉంటాడు. అతన్ని చూసిన చాలా మంది కోహ్లి ఎవరి మాటా వినడు అని అనుకుంటారు. కానీ అతడు చాలా సింపుల్‌గా ఉంటాడు. టీమ్ సెలక్షన్‌లోనూ అందరు చెప్పింది శ్రద్ధగా విని నిర్ణయం తీసుకుంటాడు అని శరణ్‌దీప్ తెలిపాడు.
 
టీమ్‌లోని అందరు ప్లేయర్స్‌కూ అతనంటే చాలా గౌరవమని అన్నాడు. సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లలో పనివాళ్లు కచ్చితంగా ఉంటారు. అలాంటిది కోహ్లి ఇంట్లో ఎవరూ లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసినట్లు శరణ్‌దీప్ చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments