Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐకు కాసుల వర్షం. ప్రసార హక్కుల కోసం రూ.6 వేల కోట్లు

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (10:46 IST)
క్రికెట్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన బోర్డుగా ఉన్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు కాసుల వర్షం కురుస్తుంది. 2023-28 సీజన్లకు గాను మీడియా హక్కులను వయాకామ్-19 చేజిక్కించుకుంది. ఇందుకోసం బీసీసీఐకు దాదాపుగా రూ.6 వేల కోట్ల ఆదాయం రానుంది. ఈ ప్రసార హక్కుల కింద భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే అన్ని మ్యాచ్‌లను వయాకామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ ప్రసార హక్కులను చేజిక్కించుకునేందుకు ఈ-వేలం నిర్వహించగా, వీటికి సోనీ పిక్చర్స్, డిస్నీస్టార్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైనప్పటికీ వయాకామ్-19 దక్కించుకుంది. వయాకామ్ 18 సంస్థ రిలయన్స్‌కు చెందిన కంపెనీ కావడం గమనార్హం. 
 
ఈ పోటీలో విజేతగా నిలిచేందుకు వయాకామ్ 18 సంస్థ బీసీసీఐకి కళ్లు చెదిరే రీతిలో రూ.5,963 కోట్లు చెల్లించనుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్‌లను వయాకామ్ తన స్పోర్ట్స్-18 చానల్లో ఐదేళ్ల పాటు ప్రసారం చేయనుంది. ఈ ఏడాది నుంచి 2028 వరకు అన్ని సీజన్లలో మ్యాచ్‌లను వయాకామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మీడియా హక్కుల కోసం నిర్వహించిన ఈ-వేలంలో వయాకామ్ 18 సంస్థకు డిస్నీ స్టార్, సోనీ పిక్చర్స్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments