Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐకు కాసుల వర్షం. ప్రసార హక్కుల కోసం రూ.6 వేల కోట్లు

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (10:46 IST)
క్రికెట్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన బోర్డుగా ఉన్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు కాసుల వర్షం కురుస్తుంది. 2023-28 సీజన్లకు గాను మీడియా హక్కులను వయాకామ్-19 చేజిక్కించుకుంది. ఇందుకోసం బీసీసీఐకు దాదాపుగా రూ.6 వేల కోట్ల ఆదాయం రానుంది. ఈ ప్రసార హక్కుల కింద భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే అన్ని మ్యాచ్‌లను వయాకామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ ప్రసార హక్కులను చేజిక్కించుకునేందుకు ఈ-వేలం నిర్వహించగా, వీటికి సోనీ పిక్చర్స్, డిస్నీస్టార్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైనప్పటికీ వయాకామ్-19 దక్కించుకుంది. వయాకామ్ 18 సంస్థ రిలయన్స్‌కు చెందిన కంపెనీ కావడం గమనార్హం. 
 
ఈ పోటీలో విజేతగా నిలిచేందుకు వయాకామ్ 18 సంస్థ బీసీసీఐకి కళ్లు చెదిరే రీతిలో రూ.5,963 కోట్లు చెల్లించనుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్‌లను వయాకామ్ తన స్పోర్ట్స్-18 చానల్లో ఐదేళ్ల పాటు ప్రసారం చేయనుంది. ఈ ఏడాది నుంచి 2028 వరకు అన్ని సీజన్లలో మ్యాచ్‌లను వయాకామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మీడియా హక్కుల కోసం నిర్వహించిన ఈ-వేలంలో వయాకామ్ 18 సంస్థకు డిస్నీ స్టార్, సోనీ పిక్చర్స్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.4600 కోట్ల వ్యయంతో ఏపీతో పాటు నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు

జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఓవర్.. ఏం జరిగినా జగన్ బెంగళూరులోనే వుంటే ఎలా?

Amaravati: అమరావతిలో 74 ప్రాజెక్టులు- సీఆర్డీఏ భవనం ఆగస్టు 15న ప్రారంభం

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments