Webdunia - Bharat's app for daily news and videos

Install App

జట్టులో స్థానం కల్పించలేదని సెలెక్టర్‌ను బ్యాట్లతో బాదారు...

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (18:20 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ అమిత్ భండారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం అతను ఢిల్లీ మరియు డిస్ట్రిక్ట్ సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. అనుకోకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కశ్మీరీ గేట్‌లోని సెయింట్ స్టిఫెన్స్ గౌండ్ సమీపంలో అతడిపై దాడికి దిగారు. ఆ గ్రౌండ్‌లో అండర్-23 జట్టు కోసం ట్రయల్స్ జరుగుతున్నాయి.
 
కాగా ట్రయల్స్ ముగించుకొని బయటకు వచ్చిన అమిత్ భండారిపై యువకులు ఇనుపరాడ్లు, హాకీ స్టిక్‌లతో దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలతో ఉన్న అతడిని సంత్ పరమానంద్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపే దాడికి పాల్పడిన వ్యక్తులు అక్కడి నుండి పారిపోయారు. అండర్-23 జట్టులో చోటు లభించని కొందరు కక్షతో దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
దాడిలో భండారి తలకు, కాళ్ల భాగంలో ఏడు కుట్లు పడ్డాయని, ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. జట్టు సెలక్షన్‌లో స్థానం లభించని కొంతమంది ఆటగాళ్లు కక్షతో దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో బయటపడిందని, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments