Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే సిరీస్‌ దక్కేది ఎవరికి?.. నేడు ఇంగ్లండ్ - భారత్ ఆఖరాట

ఇంగ్లండ్ - భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా సిరీస్ ఫలితాన్ని శాసించే ఆఖరాట నేడు జరుగనుంది. హెడింగ్లీ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా, తొలి వన్డేలో భారత్‌

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (09:05 IST)
ఇంగ్లండ్ - భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా సిరీస్ ఫలితాన్ని శాసించే ఆఖరాట నేడు జరుగనుంది. హెడింగ్లీ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా, తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచింది. ఈ నేపథ్యంలో సిరీస్‌ విజయం కోసం ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.
 
కాగా, వన్డే సిరీస్‌కు ముందు జరిగిన టీ-20 సిరీస్‌ను కోహ్లీ సేన 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అలాగే, వన్డే సిరీస్‌లోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేయాలన్న కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు సొంత గడ్డపై వన్డే సిరీస్ గెలిచి టీ20 సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు భావిస్తున్నారు. 
 
ఇకపోతే, వన్డే ఫార్మాట్‌లో తిరుగులేని ఫాంలో ఉన్న ఇంగ్లండ్‌కు సొంత గడ్డపై కోహ్లీ సేన గట్టి సవాల్ విసిరింది. అంచనాలకు తగ్గట్టుగా తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించింది. అయితే భారత జట్టులో టాపార్డర్‌ అద్భుతంగా ఉన్నా.. మిడిలార్డర్ వైఫల్యం మాత్రం జట్టును వేధిస్తోంది. 
 
ఓపెనర్లు రోహిత్ శర్మ, ధావన్‌తో పాటు కెప్టెన్ కోహ్లీ మంచి ఫాంలో ఉన్నప్పటికీ రెండో వన్డేలో టాపార్డర్ విఫలమైతే… మిడిలార్డర్ కూడా చేతులెత్తేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో సురేష్ రైనా స్థానంలో దినేష్ కార్తీక్‌ను బరిలోకి దించాలని జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. 
 
ఇక రిస్ట్ స్పిన్నర్లతో భారత బౌలింగ్‌ అద్భుతంగా ఉంది. కుల్దీప్, చాహల్‌ మరోసారి ఈ వన్డేలో మ్యాజిక్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఇక గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఉమేష్ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌తో పేస్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది.
 
మరోవైపు రెండో వన్డే విజయంతో ఇంగ్లాండ్ రెట్టించిన ఉత్సాహంతో ఈ మ్యాచ్‌కు సన్నద్ధమైంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ కుల్దీప్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇదే జోరులో మరో మ్యాచ్‌ కూడా గెలిచి సిరీస్‌ విజయంతో టి20 లెక్క సరి చేయాలని కెప్టెన్‌ మోర్గాన్‌ భావిస్తున్నాడు. 
 
ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ గాయపడటంతో అతని స్థానంలో సామ్ బిల్లింగ్స్‌ను బరిలోకి దిగే  అవకాశముంది. హెడింగ్లీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్‌లో మరోసారి పరుగుల వరద పారతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments