Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం.. టెస్టుల్లో టీమిండియా ర్యాంకు ఎంత?

ఠాగూర్
మంగళవారం, 8 జులై 2025 (13:36 IST)
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మొత్తం 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లూ 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ కెప్టెన్ శుభమన్ గిల్ ముందుండి నడిపించాడు. 
 
రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా డబుల్ సెంచరీ, సెంచరీ బాది జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలకపాత్ర పోషించాడు. బౌలింగ్‌లో యువ పేసర్ ఆకాశ్ దీప్ అద్భుతం చేశాడు. మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా మహమ్మద్ సిరాజ్ 7 వికెట్లతో రాణించాడు. 
 
ఎడ్జ్ బాస్టన్ మైదానంలో టెస్టు క్రికెట్‌లో భారత్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. దీంతో 58 యేళ్ళ భారత నిరీక్షణకు తెరపడింది. ఇదిలావుంటే, అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ రేటింగ్‌లో అంటే పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, శ్రీలంక, ఇంగ్లండ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 
 
తాజా విజయంతో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. కాగా, ఈ మ్యాచ్ అనతరం జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ స్పందిస్తూ, జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు. "ఆకాశ్ దీప్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

కొత్త బంతితో రెండు వైపులా స్వింగ్ చేస్తూ ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అతని బౌలింగ్ అమోఘం" అని గిల్ కొనియాడాడు. ఫీల్డింగ్, బౌలింగ్ జట్టు ఎంతో మెరుగుపడిందని అన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

తర్వాతి కథనం
Show comments