Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ ద్రావిడ్‌కు కరోనా పాజిటివ్... జట్టులో కలకలం

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (11:47 IST)
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. దీంతో జట్టులో కలకలం చెలరేగింది. ప్రస్తుతం టీమిండియా జింబాబ్వే పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. 
 
ఈ నేపథ్యంలో శనివారం నుంచి ఆసియా కప్ 2022 కౌంట్‌డౌన్ ప్రారంభంకానుంది. శనివారం నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. ఇందుకోసం యూఏఈకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అయితే, జట్టుతో కలిసి రాహుల్ ద్రావిడ్ యూఏఈకి వెళ్లడం లేదు. దీనికి కారణం ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. 
 
దీంతో ద్రావిడ్ ఆసియా కప్‌లో కూడా పాల్గొనడం సందేహంగా మారింది. యూఏఈకి బయలుదేరే ముందు భారత జట్టు సభ్యులకు కోవిడ్ పరీక్షలు చేయగా, అందులో రాహుల్ ద్రావిడ్‌కు పాజిటివ్‌గా తేలినట్టు సమాచారం. అయితే, ద్రావిడ్ ఆరోగ్యంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

తర్వాతి కథనం
Show comments