Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీతుమీ తేల్చుకోనున్న భారత్ - కివీస్: కోహ్లీ సేనకు పరీక్షే!

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (10:05 IST)
దుబాయ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా భారత్‌కు అగ్నిపరీక్ష ఎదురుకానుంది. ఇప్పటికే దాయాది దేశం పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఆదివారం న్యూజిలాండ్‌తో మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. 
 
ఇక నుంచి ప్రతీ మ్యాచ్‌ భారత్‌కు సవాల్‌ కానుంది. అందుకే లోటుపాట్లను సరిచూసుకుని బరిలోకి దిగాలనుకుంటోంది. ఈ మ్యాచ్‌తో పాటు అఫ్ఘాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌పై గెలిస్తే సెమీస్‌ బెర్త్‌పై భారత్‌కు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడి మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచినా పాక్‌.. కివీస్‌ ఫలితాలపై ఆధారపడాల్సిన ఆగత్యం ఏర్పడుతుంది. 
 
కాగా, ఆరంభ మ్యాచ్‌లో భారత్‌ ఆడిన తీరు అందరినీ నిరుత్సాహపరిచింది. బౌలర్లయితే పాక్‌ జట్టులో కనీసం ఒక్క వికెట్‌ను కూడా తీయలేకపోయారు. స్లో పిచ్‌లపై ఎలా బౌలింగ్‌ చేయాలనే అవగాహన కూడా కరువైంది. అదే అఫ్ఘాన్‌ బౌలర్లు పాకిస్థాన్ జట్టుకు దాదాపు ఓటమి రుచిని చూపించగలిగారు. 
 
ఇపుడు న్యూజిలాండ్ జట్టుపై తమ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చకుంటే భారత్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. షహీన్‌ మాదిరే స్వింగ్‌ బౌలింగ్‌తో హడలెత్తించే బౌల్ట్‌ను బ్యాటర్స్‌ ఎలా ఎదుర్కొంటారనే దానిపై భారీ స్కోరు ఆధారపడి ఉంది. 
 
ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ పవర్‌ప్లేలో వికెట్‌ కోల్పోకుండా ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ ఎదురుదాడికి దిగితే తిరుగుండదు. అయితే ఓపెనింగ్‌లో కుడి.. ఎడమ చేతి బ్యాటర్స్‌ ఉంటే మేలని భావిస్తే రోహిత్‌కు జతగా ఇషాన్‌ను తీసుకునే అవకాశం లేకపోలేదు. 
 
నెట్స్‌లో హార్ధిక్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం ఆరో బౌలర్‌ కొరతను తీర్చనుంది. పేసర్‌ భువనేశ్వర్‌ స్థానంలో శార్దూల్‌ను తీసుకోవాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. అయితే జట్టులో మార్పులు లేకపోవచ్చని సమాచారం.
 
మరోవైపు, పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ మెరుగ్గానే రాణించింది. కానీ చివర్లో ఆసిఫ్‌ అలీ ధాటికి ఓటమి చెందాల్సి వచ్చింది. అయితే డారిల్‌ మిచెల్‌ ఓపెనర్‌గా.. నీషమ్‌ను నాలుగో నెంబర్‌లో ఆడించే ప్రయోగం బెడిసికొట్టింది. డెత్‌ ఓవర్లలో చక్కటి ఫినిషర్‌ లేకపోవడం జట్టుకు లోటే. డెవాన్‌ కాన్వే హిట్టింగ్‌పై కివీస్‌ భారీ స్కోరు ఆధారపడి ఉంది. విలియమ్సన్‌ నిలకడగా ఆడుతున్నాడు. ఇక బౌలింగ్‌  విభాగం బౌల్ట్‌, సౌథీ, సోధీ, శాంట్నర్‌లతో పటిష్టంగా కనిపిస్తోంది.
 
జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌, రాహుల్‌, కోహ్లీ (కెప్టెన్‌), సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌, జడేజా, శార్దూల్‌/భువనేశ్వర్‌, షమి, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా.
 
న్యూజిలాండ్‌: గప్టిల్‌, మిచెల్‌, విలియమ్సన్‌ (కెప్టెన్‌), కాన్వే, ఫిలిప్స్‌, నీషమ్‌, సైఫర్ట్‌, శాంట్న ర్‌/మిల్నే, సౌథీ, సోధీ, బౌల్ట్‌.
 
పిచ్‌
ఈ ఏడాది దుబాయ్‌లో ఆడిన 19 టీ20ల్లో చేజింగ్‌ జట్టు 15 సార్లు గెలిచింది. దీంతో టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ వైపే మొగ్గు చూపవచ్చు.
 
టీ20 ప్రపంచక్‌పలో కివీస్‌తో 
తలపడిన రెండు సార్లూ (2007,2016) భారత్‌ ఓడింది. అలాగే 2003 వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఏ ఇతర ఐసీసీ టోర్నీల్లోనూ కివీ్‌సపై భారత్‌ గెలవలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

తర్వాతి కథనం
Show comments