Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోమారు చెత్త ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ... వెనుకేసుకొచ్చిన కెప్టెన్ రోహిత్!!

వరుణ్
శుక్రవారం, 28 జూన్ 2024 (09:42 IST)
భారత క్రికెట్ జట్టుకు అత్యంత కీలకమైన మ్యాచ్‌లోనూ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోమారు చెత్త ప్రదర్శన చేశాడు. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, గురువారం రెండో సెమీ ఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విరాటో కోహ్లీ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. దీనిపై క్రికెట్ విశ్లేషకులతో పాటు.. క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం పెద్ద మనసుతో కోహ్లీకి అండగా నిలబడ్డాడు. 
 
విరాట్‌కు మద్దతుగా రోహిత్ మాట్లాడాడు. కోహ్లి ఫామ్ ఆందోళన కలిగించే అంశం కాదని చెప్పాడు. అతని ఫామ్ గురించి అర్థం చేసుకోగలమని అన్నాడు. కోహ్లీ నాణ్యమైన ఆటగాడని, ఎలాంటి ఆటగాడైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాడని మద్దతుగా నిలిచాడు. విరాట్ ఎలాంటి ఆటగాడో, అతడి విలువేంటో తాము ఎప్పుడూ సమస్య కాదని, అతడి ఉద్దేశం ముఖ్యమని అన్నాడు. దీని ద్వారా ఫైనల్ ఆడించడం ఖాయమని అని రోహిత్ సంకేతాలు ఇచ్చాడు. ఇక ఇంగ్లండ్‌పై విజయంపై స్పందిస్తూ.. ఒక జట్టుగా చాలా ప్రశాంతంగా ఈ మ్యాచ్ ఆదామని, పరిస్థితులకు తగ్గట్టు ఆదామని వివరించాడు. చక్కటి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నామని, ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే చేయాలనుకుంటున్నామని రోహిత్ చెప్పాడు.
 
మరోవైపు, ఈ మెగా టోర్నీలో విరాట్ అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 75 పరుగులు మాత్రమే చేశాడు. ఎంత పేలవ ప్రదర్శన చేశాడో ఈ పరుగులను చూస్తే అర్థమైపోతుంది. ఇందులో రెండు సార్లు డకౌట్ కూడా అయ్యాడు. ఇక అత్యంత కీలకమైన సెమీ ఫైనల్లోనూ ఇదే తరహా ప్రదర్శన చేశాడు. గురువారం ఇంగ్లండ్ జరిగిన మ్యాచ్లో కేవలం 9 పరుగుల కొట్టి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో రీస్ టోప్లీ వేసిన ఓవర్‌లో షాట్ ఆడబోయి ఔట్ అయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments