టీమిండియా టీమ్ ఇలా ఎందుకు విడిపోయిందో నాకు తెలియదు.. అక్తర్

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (18:14 IST)
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుస ఓటముల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ స్పందించాడు. టీమిండియాలో పరిస్థితులు ఏమీ బాగా లేవని, జట్టు రెండుగా విడిపోయిందన్న విషయం అర్థమవుతోందని పేర్కొన్నాడు.

ఒకటి కోహ్లీ గ్రూపు కాగా, మరొకటి కోహ్లీ వ్యతిరేక గ్రూపు అని వివరించాడు. తొలి రెండు మ్యాచ్ లలో కోహ్లీ కొన్ని చెత్త నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, అతనొక గొప్ప క్రికెట్ ఆటగాడని, ఆ విషయాన్ని అందరూ గౌరవించాలని సూచించాడు.
 
"టీమిండియాలో రెండు గ్రూపులు ఉన్నాయన్నది అత్యంత స్పష్టం. అయితే టీమ్ ఇలా ఎందుకు విడిపోయిందో నాకు తెలియదు. బహుశా కోహ్లీ కెప్టెన్ గా ఇదే తన చివరి టీ20 వరల్డ్ కప్ అని ప్రకటించిన తర్వాత ఏర్పడిన పరిణామాల వల్ల ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమై ఉండొచ్చు" అని అక్తర్ వివరించాడు.
 
ఇక, న్యూజిలాండ్ తో మ్యాచ్ లో టీమిండియా ఆటతీరుపైనా అక్తర్ విమర్శలు చేశాడు. ఆ మ్యాచ్ లో టాస్ ఓడిపోగానే టీమిండియా ఆటగాళ్లు డీలాపడ్డారని వివరించాడు. అక్కడినుంచే వారి ఓటమి ప్రారంభమైందని అన్నాడు. మ్యాచ్ సందర్భంగా వారి దృక్పథమే బాగాలేదని అక్తర్ వ్యాఖ్యానించాడు. కాగా, సూపర్-12 దశలో టీమిండియా తన మూడో మ్యాచ్ ను ఆఫ్ఘనిస్థాన్ తో బుధవారం ఆడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జయ జయహే తెలంగాణ రచయిత అందెశ్రీ ఇకలేరు..

Mukesh Ambani: తిరుమలలో ఆధునిక ఉపగ్రహ వంటగది నిర్మాణానికి ముఖేష్ అంబానీ

మంచి ఆరోగ్యం లేకపోతే ఎంత సంపద ఉన్నా వృధానే : సీఎం చంద్రబాబు

తండ్రి మరణించాడని తెలిసి కన్నెత్తి చూడని తాగుబోతు.. అంత్యక్రియలు నిర్వహించిన అధికారులు

పీజేఆర్‌ను చంపిందే కాంగ్రెస్.. ఆయన ఫ్యామిలీకి రేవంత్ చోటు లేకుండా చేశారు : జగదీశ్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవిని క్షమాపణలు కోరిన వర్మ ... ఎందుకో తెలుసా?

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

తర్వాతి కథనం
Show comments