Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిడ్నీ వన్డే : ఆసీస్ ఆటగాళ్ల వీరకుమ్ముడు.. భారత బౌలర్ల బేజారు

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (12:40 IST)
సిడ్నీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు వీరవిహారం చేస్తున్నారు. ఫలితంగా ఆసీస్ జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే 45 ఓవర్లలు ముగియగా 3 వికెట్లు నష్టానికి 327 పరుగుల భారీ స్కోరు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా వార్నర్, ఫించ్‌లు ఓపెనర్లుగా దిగి.. తొలి వికెట్‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వార్నర్ 83 పరుగుల వద్ద, ఫించ్ 60 రన్స్ వద్ద ఔట్ అయ్యారు. వీరిలో ఫించ్ 69 బంతుల్లో 60 పరుగులు చేసి, ఒక సిక్సు, ఆరు ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసిన ఔటయ్యాడు. అనంతరం కొద్ది సేపటికే డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. అతడు 77 బంతుల్లో 3 సిక్సులు, 7 ఫోర్లతో 83 పరుగులు చేశాడు.
 
ఆ తర్వాత మూడో ఆర్డరులో వచ్చిన స్మిత్ మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. దూకుడుగా ఆడుతూ 2 సిక్సులు, 14 ఫోర్లతో సెంచరీ బాదాడు. 104 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో లాబుస్చాగ్నే 51, మ్యాక్స్ వెల్ 10 పరుగులతో ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టు స్కోరు 45.4 ఓవర్లలో 337/3గా ఉంది. భారత బౌలర్లలో షమీ, పాండ్యాలకు ఒక్కో వికెటు దక్కాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

Ahmedabad Plane Crash: ఏపీ వార్షిక విజయోత్సవాలు వాయిదా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

తర్వాతి కథనం
Show comments