Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను బతికే ఉన్నా బాబోయ్ అంటున్న భారత క్రికెటర్

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (15:38 IST)
భారత క్రికెట్ జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకునే క్రికెటర్లలో సురేశ్ రైనా ఒకరు. ఫామ్ లేమితో ఉన్న సురేశ్ రైనా.. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అదేసమయంలో సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదు. దీంతో సురేష్ రైనా ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయారంటూ వదంతులు వచ్చాయి. ఈ వదంతులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సురేష్ రైనా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ వదంతులపై సురేశ్ రైనా స్పందిస్తూ, 'కారు ప్రమాదంలో నేను మరణించినట్లు కొన్ని అసత్య వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. వీటి ద్వారా నా కుటుంబసభ్యులు, స్నేహితులు చాలా భయాందోళనకు గురయ్యారు. అలాంటి వార్తలను అసలు నమ్మకండి. భగవంతుని దయ వల్ల నేను చాలా బాగున్నాను. ఫేక్ వార్తలు ప్రసారం చేస్తున్న యూట్యూట్ చానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది' అని రైనా ట్వీట్ చేశాడు.
 
కాగా, బతికుండగానే మనిషిని చంపేయడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారిపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తూ కొంతమంది రాక్షసానందం పొందుతున్నారు. ఇలాంటివారు ఇపుడు సురేశ్ రైనాను రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments