Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్ వికెట్ గమ్మత్తుగా ఉంది.. అక్కడే రిథమ్ కోల్పోయి ఓడిపోయాం : స్మిత్

ఠాగూర్
బుధవారం, 5 మార్చి 2025 (17:04 IST)
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మంగళవారం దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు 264 పరుగులు చేసినప్పటికీ ఓటమి పాలైంది. ఈ ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించారు. దుబాయ్ వికెట్ కాస్త గమ్మత్తుగా ఉంది. అందుకే భారీ స్కోరు ఈ వికెట్‌పై సాధించలేకపోతున్నారు. మేం కీలక సమయంలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయాం. నేను ఔటైన వెంటనే మ్యాక్స్‌వెల్ కూడా వికెట్‌ను సమర్పించాడు. అక్కడే మేము రిథమ్ కోల్పోయాం. 
 
ఈ మ్యాచ్‌లో 280కి పైగా పరుగులు చేసివుంటే ఫలితం మరోలా ఉండేది. మిడిల్ ఓవర్లలో ఒక్క భారీ భాగస్వామ్యం నెలకొల్పివుంటే ఉండివుంటే లక్ష్యానికి చేరువయ్యే వాళ్లం. అపుడు ప్రత్యర్థిపై ఒత్తిడి ఉండేది. ఈ టోర్నీలో మా కుర్రాళ్లు బాగా రాణంచారు. ముఖ్యంగా, మా బౌలింగ్‌ ఎటాక్‌లో ఒక్క అనుభవం ఉన్న బౌలర్ లేడు. అయినప్పటికీ టోర్నీ అసాంతం వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇంగ్లండ్ మ్యాచ్‌లో భారీ విజయలక్ష్యాన్ని ఛేదించాం. మా జట్టులోని కొంతమంది కుర్రోళ్లు భవిష్యత్‌లో ఖచ్చితంగా అత్యుత్తమ క్రికెటర్లుగా ఎదుగుతారు అని స్మిత్ గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

తర్వాతి కథనం
Show comments