Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ట్వంటీ20 వరల్డ్ కప్ : ఫైనల్ మ్యాచ్ వీక్షించిన ప్రేక్షకుడికి కరోనా

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (17:09 IST)
ఇటీవల ఐసీసీ మహిళా ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీ జరిగింది. ఇందులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఏమాత్రం పోరాటం చేయకుండానే చేతులెత్తేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా మహిళా జట్టు విశ్వవిజేతగా నిలిచింది. అయితే, ఈ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియంలోకి వచ్చిన ప్రేక్షకుల్లో ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం అధికారులు తాజాగా ప్రకటించారు. ఇది మ్యాచ్‌కు వచ్చిన ప్రేక్షకులతో పాటు.. ఆస్ట్రేలియా అధికారులను భయపెడుతోంది. 
 
ఎంసీజీ స్టేడియం నార్త్ స్టాండ్‌లోని ఎన్42 సెక్షన్‌లో ఆ వ్యక్తి కూర్చున్నారని, ఆ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు వెల్లడించారు. అయితే, మ్యాచ్‌ రోజు ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రేక్షకులు, మైదానం సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆ వ్యక్తి నుంచి వాళ్లకు కరోనా సోకే అవకాశం చాలా తక్కువగా ఉందన్నారు. కాబట్టి వాళ్లంతా సాధారణంగా ఉండొచ్చని, కాకపోతే శుభ్రత పాటించాలని సూచించారు. దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments