Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో ట్వంటీ20లో భారత్ గెలుపు - సిరీస్ కైవసం

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (09:44 IST)
భారత క్రికెట్ జట్టు మరో విజయం సాధించింది. స్వదేశంలో పర్యాటక శ్రీలంక జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ ఆదివారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో జరుగనుంది. మరోవైపు, ఇది భారత జట్టుకు వరుసగా ఎనిదో విజయం కావడం గమనార్హం. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. ఓపెనర్ నిశ్శంక 53 బంతుల్లో 11 ఫోర్లతో 75 పరుగులతో చెలరేగడానికితోడు మ్యాచ్ ఆఖరులో కెప్టెన్ షనక 19 బంతుల్లో రెండో ఫోర్లు, ఐదు సిక్సర్లతో వీర విహారం చేసి 47 పరుగులు చేయడంతో మొత్తం 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 184 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మరో 17 బంతులు మిగిలివుండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇది భారత్‌కు వరుసగా ఎనిమిదో విజయం కాగా, కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది వరుసగా ఎనిమిదో విజయం కావడం గమనార్హం. 
 
ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయినప్పటికీ మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (16) పరుగులు చేశాడు. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 44 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అలాగే సంజు శాంసన్‌ కూడా 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు, రవీంద్ర జడేజా 18 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 45 పరుగులు చేయడంతో అపురూప విజయాన్ని అందించాడు. బ్యాటింగులో ఇరగదీసిన శ్రేయాస్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ ఫ్యూజన్‌ను వేడుక చేసుకునేలా టేకిలాను విడుదల చేసిన లోకాలోక

1వ తేదీ జీతం రాకపోతే ఇంట్లో ఎలా వుంటుందో నాకు తెలుసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

లెహంగాతో వధువు.. పాస్‌కు ఇబ్బంది.. ఆ వీడియోను కూడా పోస్ట్ చేస్తారా?

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కేసు పెట్టిన మహిళ.. ఎందుకు?

వాలంటీర్లను ఏవిధంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నాం: మంత్రి పార్థసారధి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments