Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ : భారత్ ఆధిక్యం 144 రన్స్ - ఆదుకున్న జడేజా

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (20:07 IST)
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ క్రమంగా పట్టు సాధిస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 144 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లు క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరూ అర్థ సెంచరీలు చేయడం గమనార్హం. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుని తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత్... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు కష్టసాధ్యమైన ఇక్కడి పిచ్‌పై ప్రస్తుతానికి భారత్‌కు 144 పరుగులు కీలకమైన ఆధిక్యం లభించింది. రవీంద్ర జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 
 
గాయం నుంచి కోలుకుని దాదాపు ఆరు నెలల తర్వాత మైదానంలో దిగిన రవీంద్ర జడేజా... అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు నేలకూల్చాడు. అలాగే, బ్యాటింగ్‌లోనూ రాణించి 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని అందించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో టాడ్ మర్ఫీ 5, కెప్టెన్ పాట్ కమిన్స్ 1, నాథన్ లైయన్ 1 చొప్పున వికెట్ తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments