నాకు బరోడాతో ఎంతో అనుభవం ఉంది : సచిన్ టెండూల్కర్

ఠాగూర్
మంగళవారం, 8 అక్టోబరు 2024 (09:59 IST)
దేశంలోని ఉన్న జాతీయ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాకు బ్రాండ్ అంబాసిడర్‌గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన బరోడాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అండర్-15 టోర్నమెంట్ లో మహారాష్ట్ర తరపున ఆడి, 123 పరుగులు చేశానని చెప్పిన సచిన్ బరోడాతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. 
 
తాను ముంబై తరపున ఆడి మొదటి సెంచరీ బరోడాలో చేశానని, ఈ విషయం చాలా మందికి తెలియదని, 1986లో అండర్-15 టోర్నమెంట్‌లో మహారాష్ట్ర తరపున పాల్గొని 123 పరుగులు చేశానని భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన సందర్భంగా ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో సచిన్ తన తొలి ఇన్నింగ్స్, బరోడాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
 
అండర్-15 టోర్నమెంట్లో మహారాష్ట్ర తరపున ఆడిన తర్వాత ముంబై రంజీ జట్టుకు ఎంపికైనట్లు తెలిపారు. అప్పుడు ప్రాబబుల్స్‌లో ఉన్నా తుది జట్టులో చోటు దక్కలేదన్నారు. కానీ యాదృచ్ఛికంగా ఆ మ్యాచ్ కూడా బరోడాలోనే జరిగిందని గుర్తుచేశారు. ఆ సమయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఫౌండర్ సయాజీ రావు గైక్వాడ్ 3 ప్యాలెస్‌ను సందర్శించే అవకాశం తనకు లభించిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూపీలో దారుణం : దళితుడిపై అగ్రవర్ణాల దాష్టీకం.. బూట్లు నాకించి.. చేయి విరగ్గొట్టారు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

తర్వాతి కథనం
Show comments