మిమ్మలను చూసి గర్విస్తున్నాం.. మీకంటూ ఓ రోజు వస్తుంది.. సచిన్

Webdunia
సోమవారం, 9 మార్చి 2020 (08:10 IST)
ఐసీసీ మహిళల ట్వంటీ20 క్రికెట్ టోర్నీ భారత యువ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. లీగ్ మ్యాచ్‌లన్నింటిలో అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టిన భారత జట్టు.. ఫైనల్‌లో మాత్రం ప్రత్యర్థి జట్టు ముందు తలవంచింది. దీంతో ట్రోఫీని తొలిసారి ముద్దాడాలన్న కోరిక నెరవేరలేదు. పైగా, ఈ ఓటమితో జట్టు సభ్యులు బోరున విలపించారు. కుంగిపోయారు. 
 
ఈ నేపథ్యంలో యువ మహిళా క్రికెటర్ల ఆటతీరుపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. ప్రపంచ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలియజేశారు. "టీమిండియాకు ఇది నిజంగా క్లిష్టమైన సమయం. మనది ఇంకా యువ జట్టే కాబట్టి భవిష్యత్తులో మరింత దృఢమైన జట్టుగా ఎదుగుతుంది. ఇప్పటివరకు మీ ప్రదర్శన పట్ల ఎంతో గర్విస్తున్నాం. కఠోరంగా శ్రమించండి, ఆశాభావాన్ని వీడొద్దు. ఏదో ఒక రోజు తప్పకుండా సాధిస్తారు" అంటూ ట్విట్టర్‌లో ఓదార్పు వచనాలు పలికారు.
 
కాగా, మహిళల టి20 వరల్డ్ కప్‌లో ఫైనల్ వరకు ఒక్క ఓటమి కూడా ఎదుర్కోకుండా వచ్చిన టీమిండియా, ఆఖరిపోరాటంలో విఫలం కావడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. భారీ లక్ష్యఛేదనలో కనీస పోరాటం కూడా లేకుండా టీమిండియా అమ్మాయిలు ఓడిన విధానం మరింత బాధిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంట చేనుకు చీడపడితే ఏ మందు కొట్టాలో బాగా తెలుసు : సీఎం రేవంత్ రెడ్డి

పంచాయతీరాజ్ వ్యవస్థను రాజులా పాలిస్తున్నారు: పంచాయతీ కార్యదర్శి ఉద్వేగం (video)

ప్రేమికురాలిని దిండుతో చంపేసిన ప్రియుడు

వివాహితతో ఏకాంతంగా వ్యక్తి, ఇద్దర్నీ చెట్టుకు కట్టేసి చితక బాదారు

బస్సులో వున్న ఆ అమ్మాయిని మాకు అప్పగించి వెళ్లు: డ్రైవర్‌కి గంజాయ్ బ్యాచ్ డిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yash: సెక్సీ, ర‌గ్డ్ లుక్‌లో య‌ష్.. టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌లో క‌నిపిస్తున్నాడు

Karti: అభిమానం ఒక దశ దాటితే భక్తి అవుతుంది : హీరో కార్తి

త్రివిక్రమ్ - వెంకటేష్ చిత్రానికి టైటిల్ ఖరారు.. ఏంటంటే...

సినీ నటిని ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఆర్థిక కష్టాలు..

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

తర్వాతి కథనం
Show comments