భారత క్రికెట్ జట్టుతో ఎన్టీఆర్... నజీర్ ఖాన్ ఇంట్లో సందడి

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (15:12 IST)
భారత్‌తో క్రికెట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు హైదరాబాద్ నగరానికి చేరుకుంది. అలాగే, భారత జట్టు కూడా ఇక్కడకు వచ్చింది. ఈ రెండు జట్ల మధ్య బుధవారం జరుగనుంది. దీంతో ఇరు జట్లూ సరదాగా గడిపారు. ఈ క్రమంలో భారత క్రికెటర్లతో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిశాడు. సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, చాహల్, శార్దూల్ ఠాకూర్‌లు ఉన్నారు. వీరిని కలుసుకున్న ఎన్టీఆర్ సరదాగా ముచ్చటించారు. 
 
హైదరాబాద్ నగరంలో ఖరీదైన కార్‌ కలెక్షన్స్‌తో ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్‌ వాసి నజీర్ ఖాన్‌ ఇంట్లో క్రికెటర్లు, ఎన్టీఆర్‌ల మధ్య భేటీ జరిగింది. టీమిండియా ఆటగాళ్లలో పలువురు నజీర్‌కు స్నేహితులు ఉండటంతో వారంతా అతడి ఇంటికి వచ్చారు. క్రికెటర్లతో తమ అభిమాన నటుడి ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంటూ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయిపోయారు.
 
ముఖ్యంగా, "ఆర్ఆర్ఆర్" చిత్రంలోని 'నాటు-నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్‌ను అందుకోవడంపై సూర్యకుమార్‌ యాదవ్‌ శుభాకాంక్షలు చెప్పాడు. తన సతీమణి దేవిషా శెట్టితో కలిసి ఎన్టీఆర్‌తో దిగిన  ఫొటోను సూర్యకుమార్‌ యాదవ్‌ తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. సూర్య పోస్టుకు ఎన్టీఆర్‌ స్పందిస్తూ.. "ధన్యవాదాలు సూర్య.. రేపు (కివీస్‌పై) మ్యాచ్‌లో అదరగొట్టాలి" అంటూ రిప్లై ఇచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగిసంగటిలో బొద్దింక ... ఉలిక్కిపడిన హైదరాబాద్ ఆహార ప్రియులు

మరో ఆరు నెలల్లో విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయ్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

గెలిచిన తర్వాత పార్టీ మారితే ఇంటికొచ్చి చితక్కొడతాం : భారాస ఎమ్మెల్యే వార్నింగ్

అమ్మవారి వేడుకల్లో భార్యతో కలిసి నృత్యం.. అంతలోనే భర్త అనతలోకాలకు...

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

తర్వాతి కథనం
Show comments