వీరేంద్ర సెహ్వాగ్‌-సచిన్ అదుర్స్.. ఫోర్లు, సిక్సర్లతో చితక్కొట్టారు.. భారత్ జయభేరి

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (15:06 IST)
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. భారత మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్‌ (35 బంతుల్లో 80 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), సచిన్‌ టెండూల్కర్‌ (33 నాటౌట్‌; 5 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. ఈ లీగ్‌లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌తో జరిగిన టీ20 పోరులో భారత్‌ 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట బంగ్లా 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. 
 
భారత బౌలర్లలో యువరాజ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, వినయ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో మాజీ ఓపెనర్లు రెచ్చిపోవడంతో భారత్‌ లెజెండ్స్‌ జట్టు 61 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. వీరేంద్రుడు సహజసిద్ధ దూకుడుతో చెలరేగి 10 ఫోర్లు, 5 సిక్సర్లు బాదగా.. సచిన్‌ తన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో అలరించాడు.
 
బోక్సామ్‌ ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ టోర్నీలో సిమ్రన్‌జీత్‌కౌర్‌(60కి) ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో కిరియా తాపియాను సిమ్రన్‌జిత్‌ చిత్తుచేసింది. మరోవైపు జాస్మిన్‌(57కి), పూజ రాణి(75కి) ప్రత్యర్థుల విజయాలతో తుది పోరులో నిలిచారు. 
 
చాలారోజుల తర్వాత బౌట్‌లోకి దిగిన స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ క్వార్టర్స్‌లో వర్జినియా చేతిలో ఓడి కాంస్య పతకంతో సంతృప్తిపడింది. పురుషుల విభాగంలో మొత్తం ఆరుగురు భారత బాక్సర్లు సెమీస్‌లో తలపడేందుకు సిద్ధంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

తర్వాతి కథనం
Show comments