Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెరుగైన వైద్యం కోసం ముంబైకు రిషబ్ పంత్.. బీసీసీఐ ప్యానెల్ సమీక్ష

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (14:26 IST)
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారత జాతీయ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ముంబైకు తరలించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పెద్దలు భావిస్తున్నారు. ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందించాలని, అక్కడ వీలుపడకపోతే మరింత మెరుగైన వైద్యం కోసం విదేశానికి తరలించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐకు చెందిన వైద్యుల ప్యానెల్ రిషబ్ పంత్ మెడికల్ రిపోర్టులను ఎగ్జామిన్ చేయనుంది. 
 
కాగా, డిసెంబరు 30వ తేదీన రూర్కీ జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోకాలులో లిగమెంట్ తెగిపోయింది. నుదురు, వీపు భాగాలపై గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతడికి డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, మెరుగైన చికిత్స కోసం పంత్‌ను ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించాలని బీసీసీఐ భావిస్తుంది. 
 
అంతేకాకుండా, బీసీసీఐ ప్యానెల్ వైద్యులు రిషబ్ పంత్‌ వైద్య రిపోర్టులను పరిశీలించి, అతడి తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు. దీని ఆధారంగా అవసరమైతే మెరుగైన చికిత్స కోసం పంత్‌ను విదేశానికి తరలించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా, లండన్‌కు తరలించే అవకాశాలు ఉన్నట్టు బీసీసీఐ వర్గాల సమాచారం. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నారు. పంత్ మళ్లీ బరిలోకి దిగాలంటే అతని మోకాలి లిగమెంట్ సమస్య పూర్తిగా నయం కావాల్సివుంది. ఈ విషయంలోనే పంత్‌కు మెరుగైన వైద్యం అందించాలన్న తలంపులో బీసీసీఐ ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

వరుసబెట్టి మావో అగ్రనేతలను లేపేస్తున్న 'ఆపరేషన్ కగారు'

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

తర్వాతి కథనం
Show comments