Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెరుగైన వైద్యం కోసం ముంబైకు రిషబ్ పంత్.. బీసీసీఐ ప్యానెల్ సమీక్ష

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (14:26 IST)
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారత జాతీయ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ముంబైకు తరలించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పెద్దలు భావిస్తున్నారు. ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందించాలని, అక్కడ వీలుపడకపోతే మరింత మెరుగైన వైద్యం కోసం విదేశానికి తరలించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐకు చెందిన వైద్యుల ప్యానెల్ రిషబ్ పంత్ మెడికల్ రిపోర్టులను ఎగ్జామిన్ చేయనుంది. 
 
కాగా, డిసెంబరు 30వ తేదీన రూర్కీ జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోకాలులో లిగమెంట్ తెగిపోయింది. నుదురు, వీపు భాగాలపై గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతడికి డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, మెరుగైన చికిత్స కోసం పంత్‌ను ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించాలని బీసీసీఐ భావిస్తుంది. 
 
అంతేకాకుండా, బీసీసీఐ ప్యానెల్ వైద్యులు రిషబ్ పంత్‌ వైద్య రిపోర్టులను పరిశీలించి, అతడి తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు. దీని ఆధారంగా అవసరమైతే మెరుగైన చికిత్స కోసం పంత్‌ను విదేశానికి తరలించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా, లండన్‌కు తరలించే అవకాశాలు ఉన్నట్టు బీసీసీఐ వర్గాల సమాచారం. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నారు. పంత్ మళ్లీ బరిలోకి దిగాలంటే అతని మోకాలి లిగమెంట్ సమస్య పూర్తిగా నయం కావాల్సివుంది. ఈ విషయంలోనే పంత్‌కు మెరుగైన వైద్యం అందించాలన్న తలంపులో బీసీసీఐ ఉంది. 

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments