Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్‌కు దూరమైన రవీంద్ర జడేజా

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (19:53 IST)
భారత క్రికెట్ జట్టులో రవీంద్ర జడేజా ఎంతో కీలకమైన ఆటగాడు. ఈ ఆల్‌రౌండర్ ఇపుడు ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్‌కు దూరమయ్యాడు. ఈ టోర్నీ వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరుగనుంది. అయితే, మోకాలికి ఆపరేషన్ కారణంగా జడేజీ ఈ టో్ర్నీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, జడేజాకు ఏ విధంగా గాయం ఏర్పడిందన్న విషయం ఇపుడు వెలుగులోకి వచ్చింది. దీంతో అతనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేశాడు.
 
జడేజాకు గాయం ఎలా తగిలిందంటే.. ఆసియా కప్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు దుబాయ్‌లో ఓ స్టార్ హోటల్‌లో బస చేసింది. ఖాళీ సమయంలో దుబాయ్ సముద్ర జలాల్లో జలక్రీడలకు రవీంద్ర జడేజా వెళ్లి గాయపడ్డాడు. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్‌లో స్కీబోర్డు జలక్రీడను ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన జడేజాకు మోకాలుకు దెబ్బ తగిలింది. ఆ గాయం తీవ్రమైనది కావడంతో జడేజా ముంబైకి వచ్చి ఆపరేషన్ చేయించుకున్నాడు. 
 
ఈ విషయం తెలిసిన బీసీసీఐ జడేజాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓవైపు ఆసియా కప్ జరుగుతుండగా, మరికొన్ని రోజుల్లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరగాల్సివుంది. ఇలాంటి తరుణంలో జలక్రీడలు ఏంటని మండిపడుతోంది. మొత్తంమీద రవీంద్ర జడేజా స్వయంకృతాపరాధం వల్ల ఇపుడు ఆయన ఏకంగా టీ20 వరల్డ్ కప్ టోర్నీకి దూరం కావాల్సివచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

తర్వాతి కథనం
Show comments