Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కడుంటే అక్కడే ఓటేయాలి.. రవిచంద్రన్ అశ్విన్ విజ్ఞప్తి

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (11:05 IST)
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలామంది తమ తమ సొంత ఊర్లకు ప్రయాణమవుతుంటారు. ఓటర్ ఐడీ ప్రకారం ఏ ప్రాంతంలో ఓటును వేయాలో అక్కడికే వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ చేశాడు.


ఏప్రిల్‌తో పాటు మే నెలలో జరిగే లోక్‌సభ ఎన్నికల సమయంలో తాము ఎక్కడ వుంటే అక్కడే ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు అశ్విన్‌ ప్రధానికి ట్వీట్‌ చేశాడు. 
 
ఎన్నికలు జరిగే సమయంలో ఐపీఎల్‌ జరుగుతోంది. దానిలో భాగంగా భారత జట్టు దేశంలోని వివిధ నగరాల్లో ఆడవలసి వస్తుంది. ఈ పోటీలు జరిగే సమయంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు తాను నివసించే పట్టణంలోనే ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన వల్ల క్రికెటర్లకు ఓటు వేసే అవకాశం ఉండదు. అయితే, తాము ఓటు తప్పని సరిగా వేయాలి. 
 
అందుకే తామున్న చోట్లోనే ఓటు వేసే అవకాశం కల్పించాలని ప్రధానిని కోరారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని అశ్విన్‌ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. మరి అశ్విన్ విజ్ఞప్తిపై ప్రధాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక చీకటి కోణం : వామ్మో... విస్తుపోయే నిజాలు!

ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు - నలుగురి దుర్మరణం!!

TDP: ఐదు నెలల జీతాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

సూది గుచ్చకుండానే రక్త పరీక్ష ఎలా? నిలోఫర్ ఆస్పత్రి ఘనత!

తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

తర్వాతి కథనం
Show comments