Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా రమీజ్ రాజాకు ఉద్వాసన

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (13:47 IST)
పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస ఓటములను చవిచూస్తుంది. ఈ జట్టు వైఫల్యాలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా మెడకు చుట్టుకుంది. చివరకు ఆయన పదవికి ఎసరు పెట్టింది. రమీజ్ రాజాను క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి తప్పించారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని ఆదేశాలు జారీచేశారు. అదేసమయంలో కొత్త ఛైర్మన్‌గా నజీమ్ సేథీని నియమించారు. రమీజ్ రాజా 15 నెలల పాటు పీసీబీ ఛైర్మన్‌గా ఉన్నారు. 
 
ఇదిలావుంటే, పాకిస్థాన్ జట్టు స్వదేశంలో ఆడిన క్రికెట్ సిరీస్‌లతో పాటు విదేశీ గడ్డలపై జరిగిన సిరీస్‌లలో కూడా ఓడిపోయింది. ముఖ్యంగా ఇంగ్లండ్ సిరీస్‌లో పిచ్‌ల తయారీపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది రమీజ్ రాజా ఉద్వాసనకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 
 
పాకిస్థాన్ ప్రధాని పీసీబీకి ప్యాట్రన్ ఇన్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. దీంతో రమీజాను తొలగించి, ఆయన స్థానంలో నజీమ్ సేథీకి బాధ్యతలు అప్పగించినట్టు ప్రధాని పేరుమీద విడుదలైన ఓ ప్రకటన వెల్లడించింది. 
 
మరోవైపు, నజీమ్ సేథీ పీసీబీ సీఈవోగా 2013 నుంచి 2018 వరకు సేవలు అందించారు. అయితే 2018 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

తూత్తుకుడి లవ్ స్టోరీ... ఉదయం పెళ్లి, మధ్యాహ్నం శోభనం.. రాత్రి ఆస్పత్రిలో వరుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

తర్వాతి కథనం
Show comments