Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టు కోచ్‌ పదవిని సున్నితంగా తిరస్కరించిన ద్రవిడ్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (15:58 IST)
భారత క్రికెట్ జట్టు కోచ్ పదవిని మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం కోచ్‌గా రవిశాస్త్రి కొనసాగుతున్నారు. ఆయన ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీమిండియా తదుపరి కోచ్‌ ఎవరనే అంశంపై విపరీతమైన చర్చ జరుగుతోంది. 
 
ఈ అంశంలో అనిల్ కుంబ్లే తదితరుల పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. తాజాగా రాహుల్ ద్రవిడ్‌కు ఈ పదవి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని వార్తలొచ్చాయి. అయితే బీసీసీఐ ఆఫర్‌ను ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
 
ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కుర్రాళ్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ద్రవిడ్ భుజాలకెత్తుకొని ఉన్నాడు. దీంతోపాటు అండర్‌-19 భారత జట్టు, ఇండియా ఎ జట్లకు కోచ్‌గా ఉన్నాడు. 
 
ఈ నేపథ్యంలో రవిశాస్త్రి తప్పుకోగానే కోచ్‌ పదవిని ద్రవిడ్‌కు అప్పగించాలని బీసీసీఐ భావించింది. కానీ ద్రవిడ్ మాత్రం దీనికి సుముఖంగా లేనట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ ముగియగానే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లీ కూడా ప్రకటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

తర్వాతి కథనం
Show comments